University Of Hyderabad : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంబీఏ అడ్మిషన్లు- ఇవి తెలుసుకోండి..
University Of Hyderabad MBA admissions : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంబీఏ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత, అప్లికేషన్ గడువు- ఫీజు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎంబీఏ కోర్సు చేయాలనుకుంటున్న విద్యార్థులకు అలర్ట్! యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్).. 2025-27 అకాడమిక్ సెషన్కి సంబంధించిన ఎంబీఏ ప్రోగ్రామ్ అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. acad.uohyd.ac.in లేదా uohyd.ac.in వంటి అధికారిక వెబ్సైట్స్లో ఎంబీఏ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్కి చివరి గడువు జనవరి 15, 2025 అని గుర్తుపెట్టుకోండి.
యూఓహెచ్లో ఎంబీఏ కోర్సుకు అప్లై చేయాలని భావిస్తున్న అభ్యర్థులు ఐఐఎం- కోల్కతా నిర్వహించిన క్యాట్ 2024 పరీక్ష రాసి ఉండాలి. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
ఈ ఎంబీఏ కోర్సులో భాగంగా 30 సీట్లు ఓసీ, 11 సీట్లు ఎస్సీ, 6 సీట్లు ఎస్టీ, 20 సీట్లు ఓబీసీ, 8 సీట్లు ఈడబ్ల్యూఎస్కి కేటాయించడం జరిగింది. 4 సీట్లు పీహెచ్, డీపీ అభ్యర్థులకు ఇకేటాయించారు.
యూఓహెచ్లో ఎంబీఏ కోర్సు- అర్హత..
యూజీసీ గుర్తించిన వర్సిటీల నుంచి కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. 2025 జూన్లోపు ఈ డిగ్రీ పొంది ఉండాలి. అయితే 2025 జూన్లో పరీక్ష రాసేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. 2024 నవంబర్ 24న నిర్వహించిన క్యాట్ పరీక్షకు హాజరై ఉండాలి.
అప్లికేషన్ ఫీజు-
- జనరల్- రూ. 600
- ఈడబ్ల్యూఎస్- రూ. 550
- ఓబీసీ- రూ. 400
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ- రూ. 275
ఒక్కసారి కట్టిన ఫీజును తిరిగి చెల్లించడం జరగదు.
క్యాట్ 2024 వివరాలు..
క్యాట్ 2024 ఫలితాల్ని ఐఐఎం కోల్కతా డిసెంబర్ 20న విడుదల చేసింది. నవంబర్ 2024లో జరిగిన ఈ పరీక్షలో 14 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్ని సాధించారు. క్యాట్ 2024 పరీక్షకు 3.29లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. 2.93లక్షల మంది ఎగ్జామ్కు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విద్యార్థులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. కాగా మహిళల కన్నా పురుషులే ఎక్కువ మంది ఈ ఎగ్జామ్ రాశారు. ఇక 100 పర్సెంటైల్ సాధించిన 14మందిలో 13మంది ఇంజినీరింగ్కి చెందిన వారే ఉన్నారు. మరోవైపు 29మంది 99.99 పర్సెంటైల్ని నమోదు చేశారు. వీరిలో 24మంది ఇంజినీర్లు, నలుగురు నాన్- ఇంజినీరింగ్ విభాగానికి చెందిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఈ 29మందిలో 27 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇక 30 మంది విద్యార్థులు 99.98 పర్సెంటైల్ని సాధించగలిగారు.
వివిధ ఐఐఎంలు క్యాట్ 2024 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కోసం లెటర్లు పంపిస్తాయి . ఐఐఎంలే కాదు 86 నాన్-ఐఐఎం వ్యవస్థలు సైతం మేనేజ్మెంట్ విద్య కోసం ఈ క్యాట్ ఫలితాలను ప్రమాణికంగా తీసుకుంటాయి.
సంబంధిత కథనం