తెలంగాణ పదోతరగతి ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి ఫలితాలను విద్యార్థులు హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ లో https://telugu.hindustantimes.com/telangana-board-10th-result ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.
తెలంగాణ పదో తరగతి పరీక్షలు 21.03.2025 నుంచి 03.04.2025 వరకు నిర్వహించారు. స్పాట్ వ్యాల్యూయేషన్ ఏప్రిల్ 7 నుంచి నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించారు. ఎస్ఎస్సీ మార్చి 2025 పరీక్షలకు 5,09,564 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
ఎస్ఎస్సీ మార్చి -2025 పరీక్షలకు మొత్తం 5,07,107 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 4,96,374 మంది విద్యార్థులు రెగ్యులర్ గా, 10,733 మంది విద్యార్థులు ప్రైవేట్ గా పరీక్షలకు హాజరయ్యారు. గత సంవత్సరం మొత్తం 5,05,813 (వారిలో 4,94,207 మంది రెగ్యులర్ గా, 11,606 మంది ప్రైవేట్ గా) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మహబూబాబాద్ 99.29 శాతంతో అగ్రస్థానం సాధించింది. వికారాబాద్ 73.97 శాతం చివరి స్థానంలో ఉంది. మొత్తం 33 జిల్లాల్లో 4,96,374 మంది పరీక్షలకు హాజరవ్వగా...4,60,519 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2,28,608 మంది బాలురు, 2,31,911 మంది బాలుకలు ఉత్తీర్ణత సాధించారు.
1. ఎయిడెడ్(148)- 28
2. ఆశ్రమ(227) -126
3. బీసీ వెల్ఫేర్(261)- 143
4. ప్రభుత్వ పాఠశాలలు (497) - 73
5. కేజీబీవీ(475) - 230
6. మోడల్(194) - 79
7. ప్రైవేట్( 5063) - 2007(జీరో శాతం ఉత్తీర్ణత -2 పాఠశాలలు)
8. టీజీ రెసిడెన్షియల్(35) - 24
9. ఆర్ఈఎస్ MIN(204)- 91
10. ఎడబ్ల్యూఆర్(231) -108
11. టీడబ్ల్యూఆర్(103) - 45
12. జడ్పీ(4116) -1675
*బ్రాకెట్లలో మొత్తం పాఠశాలల సంఖ్య
మొత్తం 11,554 పాఠశాలల్లో 4,629 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. రెండు పాఠశాలలు జీరో ఉత్తీర్ణత నమోదు చేశాయి.
• రాష్ట్రంలో పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత శాతం 92.78 %
• బాలురు సాధించిన ఉత్తీర్ణత శాతం 91.32 % , బాలికల ఉత్తీర్ణత శాతం 94.26 %
• బాలికలు, బాలుర కుంటే 2.94 % అధికంగా ఉత్తీర్ణత శాతం సాధించారు.
ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా, మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా విద్యార్థులు మార్కులు, గ్రేడ్లను తెలుసుకోవచ్చు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ట్ ల వారీగా మార్కులు, గ్రేడ్లను ముద్రించనున్నారు. అలాగే కొత్త మెమో నమూనాను విద్యాశాఖ విడుదల చేసింది. 2009 నుంచి గ్రేడింగ్ విధానం అమలులోకి ఉంది. తాజాగా ఈ విధానానికి స్వస్తి చెప్పారు. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్లను ఇచ్చేవారు.
సబ్జెక్ట్ల వారీగా గ్రేడ్లతో పాటు మొత్తంగా సీజీపీఏ ఇచ్చేవారు. ఇప్పుడు గ్రేడ్ల విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
1. హెచ్.టి. తెలుగు వెబ్సైట్ను సందర్శించండి. ఈ వెబ్సైట్ను సందర్శించడానికి https://telugu.hindustantimes.com/ అనే URL ని ఉపయోగించవచ్చు.
2. హోంపేజీలో పదో తరగతి ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి. "టీజీ ఎస్ఎస్సీ డైరెక్ట్ లింక్" పై క్లిక్ చేయండి.
3. ఫలితాలను చూడటానికి వెబ్ సైట్ లింక్ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయండి.
4. మీ వివరాలను నమోదు చేసిన తర్వాత ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి. ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోని ప్రింట్ తీసుకోండి.
Step 1: తెలంగాణ బీఎస్ఈ అధికారిక వెబ్సైట్లను bse.telangana.gov.in లేదా bseresults.telangana.gov.in ను సందర్శించండి.
Step 2: హోమ్పేజీలో SSC రిజల్ట్స్ 2025 అని కనిపించే లింక్పై క్లిక్ చేయండి
Step 3: పుట్టిన తేదీ (DOB), రోల్ నంబర్, కోడ్ వంటి రిజిస్టర్డ్ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి
Step 4: సబ్మిట్ బాక్స్పై క్లిక్ చేయండి. ఫలితం స్క్రీన్పై కనిపిస్తుంది.
Step 5: భవిష్యత్తు సూచన కోసం ఫలితాలను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
సంబంధిత కథనం