తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే- రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలు ఇలా-ts ssc results 2025 released advanced supplementary exam schedule revaluation recounting details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే- రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలు ఇలా

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే- రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలు ఇలా

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో 92.78 % శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2025 విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో టెన్త్ రిజెల్ట్స్ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 91.32 % శాతం, బాలికలు 94.26 % శాతం ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3, 2025 నుంచి జూన్ 13 వరకు ఉదయం గం. 09.30 నుంచి మధ్నాహ్నం గుం.12.30 వరకు నిర్వహించనున్నారు.

పరీక్షలను అతి తక్కువ వ్యవధిలో నిర్వహించనున్న కారణంగా విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా జూన్-2025 సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.

సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు తేదీలు

1. విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లింపు చివరి తేదీ - 16.05.2025

2. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ద్వారా అనుసంధానించిన ఆన్ లైన్ లో పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ - 17.05.2025

3. ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్ ఎన్ఆర్ లతో సహా జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో సమర్పించడానికి చివరి తేదీ - 20.05.2025

4. జిల్లా విద్యాశాఖాధికారులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి ఎన్ఆర్ లు సమర్పించడానికి చివరి తేది- 22.05.2025

సంబంధిత సబ్జెక్టులో పరీక్ష ప్రారంభానికి 2 రోజుల ముందు వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.

రీకౌంటింగ్

రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సబ్జెక్టుకు రూ. 500 చొప్పున పరీక్షా ఫలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోగా అంటే మే 15, 2025 లోపు ఎస్బీఐ బ్యాంకులో ఈ కింద తెలిపిన హెడ్ ఆఫ్ అకౌంట్ కు చలాన చెల్లించి, దరఖాస్తులను నేరుగా కానీ , పోస్టు ద్వారా సంబంధిత కార్యాలయాలకు పంపించాలి.

0202 - Education, Sports, Arts & Culture

01 - General Education

102 - Secondary Education

06 - Director of Government Exams

800 - User Charge

రీవెరిఫికేషన్, జవాబు పత్రం కాపీ కోసం

విద్యార్థులు తమ పాఠశాలలో హాల్ టికెట్ జిరాక్స్ కాపీ, కంప్యూటర్ ప్రింట్ మెమో కాపీతో పాటు రీ-వెరిఫికేషన్ దరఖాస్తును సమర్పించాలి. ప్రధానోపాధ్యాయుడు ఆన్ లైన్ ద్వారా అప్లోడ్ చేసిన, డీఈవో కార్యాలయానికి సమర్పించిన దరఖాస్తులు మాత్రమే అంగీకరిస్తారు. ఎస్ఎస్సీ బోర్డుకు పోస్టులో పంపిన దరఖాస్తులు అంగీకరించరు.

దరఖాస్తు ఫారమ్ ను S.S.C. బోర్డు వెబ్ సైట్ www.bse.telangana.gov.in లో ఉంచారు. ఈ దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి నుంచి కూడా పొందవచ్చు. విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 మెత్తాన్ని ఈ కింద హెడ్ ఆఫ్ అకౌంట్ కు మాత్రమే చలాన్ ద్వారా చెల్లించాలి.

0202 - Education, Sports, Arts & Culture

01 - General Education

102 - Secondary Education

06 - Director of Government Exams

800 - User

రీవెరిఫికేషన్, జవాబు పత్రాలు కాపీల కోసం దరఖాస్తులను పరీక్షా ఫలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోగా అంటే మే 15, 2025 మాత్రమే అంగీకరిస్తారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం