తెలంగాణలో పీజీ ప్రవేశాలు - 'సీపీగెట్' దరఖాస్తులు ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి-ts cpget 2025 updates application registrations begins key dates here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణలో పీజీ ప్రవేశాలు - 'సీపీగెట్' దరఖాస్తులు ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

తెలంగాణలో పీజీ ప్రవేశాలు - 'సీపీగెట్' దరఖాస్తులు ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ - 2025 రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. ఇందులో భాగంగా…. ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు https://cpget.tgche.ac.in/ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

సీపీగెట్ - 2025

రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ షురూ అయింది. అర్హులైన అభ్యర్థులు… ఫీజు చెల్లించి, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీపీగెట్ పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

చివరి తేదీ ఎప్పుడంటే..?

సీపీగెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 17వ తేదీతో పూర్తవుతుంది. రూ. 500 ఆలస్య రుసుంతో జూలై 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే వీలు ఉంటుంది. రూ. 2 వేలతో జూలై 28 వరకు ఛాన్స్ ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయి.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…

  1. అభ్యర్థులు https://cpget.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  3. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
  4. మీ విద్యా అర్హతలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం వంటి వాటిని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  5. చివరల్లో సబ్మిట్ నొక్కి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
  6. ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ నెంబర్ ఆధారంగా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ - 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే సీపీగెట్ ప్రవేశ బాధ్యతలు చూస్తోంది.

టీజీ సీపీగెట్ లో భాగంగా పలు సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. నోటిఫికేషన్ తో పాటు సబ్జెక్టుల వారీగా వివరాల కోసం https://cpget.tgche.ac.in/ లేదా ఉస్మానియా యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్ ను చూడొచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.