టీటీడీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు, మే 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం-tirupati admissions open at ttd junior colleges application process begins may 15 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీటీడీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు, మే 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం

టీటీడీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు, మే 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం

టీటీడీ నిర్వహిస్తోన్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కాలేజీ, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు మే 15 నుంచి 31వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

టీటీడీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు, మే 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ విద్యాశాఖాధికారి టి.వెంకట సునీల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

మే 15 నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

విద్యార్థులు https://admission.tirumala.org/ వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే "Student Manual in English" లేదా "Student Manual in Telugu" రెండు బాక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ పైన క్లిక్ చేయాలి. అందులో దరఖాస్తు చేసే విధానాన్ని చదివి అర్థం చేసుకోవాలి.

అనంతరం ఇంటర్మీడియేట్ కోర్సుకు జూనియర్ కాలేజీని ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు, తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి. తమకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేయగానే టీటీడీ ఆధ్వర్యంలోని రెండు జూనియర్ కళాశాలల్లో ఉన్న గ్రూప్ లు, వాటిలోని సీట్లు, వాటిలో ప్రవేశానికి అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు కనిపిస్తాయి.

ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా

విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీటు తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయించి, విద్యార్థుల‌కు ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారం ఇస్తారు. సీటు పొందిన విద్యార్థులు ధృవీకరణ పత్రాలను అధికారులు వారి సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు.

దరఖాస్తు జాగ్రత్తగా

విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నా, ఆన్ లైన్ లో టాలీకాకున్న సీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుంచి ఆటోమేటిక్ గా దరఖాస్తు రద్దు అవుతుంది. విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు.

అందువల్ల దరఖాస్తుకు ముందు స్టూడెంట్ యూజర్ మాన్యువల్‌ను, క‌ళాశాల‌ ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని టీటీడీ కోరుతోంది.

హెల్ప్ లైన్ ద్వారా సందేహాలు నివృత్తి

విద్యార్థులు అప్లికేషన్ నింపే సమయంలో సాంకేతిక సందేహాలు, కోర్సులలోని వివిధ గ్రూప్ లు, వసతి గృహాలు, నిబంధనలు తదితర సందేహాలను హెల్ఫ్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే స్క్రీన్ పై హెల్ఫ్ లైన్ నంబర్లు అనే బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సంబంధిత ప్రొఫెసర్ల ఫోన్ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆయా అంశాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.