టీజీఆర్జేసీ సెట్‌ - 2025 ఫలితాలు విడుదల... మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి-tgrjc cet 2025 results out direct link to download rank card here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీజీఆర్జేసీ సెట్‌ - 2025 ఫలితాలు విడుదల... మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

టీజీఆర్జేసీ సెట్‌ - 2025 ఫలితాలు విడుదల... మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

టీజీ ఆర్‌జేసీ సెట్ - 2025 ఫలితాల విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు tgrjc.cgg.gov.in వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్హత పొందిన విద్యార్థులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

టీజీ ఆర్‌జేసీ సెట్ - 2025 ఫలితాల విడుదల

టీఎస్‌ ఆర్‌జేసీ సెట్‌ - 2025 రిజల్ట్స్ వచ్చేశాయ్. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా రాష్ట్రంలోని గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు. 2025 - 26 విద్యా సంవత్సరానికి గాను సీట్లు కేటాయిస్తారు. పరీక్ష రాసిన అభ్యర్థులు tgrjc.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:

  1. పరీక్ష రాసిన అభ్యర్థులు https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో చివరగా ఉండే ఆన్ లైన్ రిజిల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు క్యాప్చా కోడ్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  4. మీ స్కోర్, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు మే 10వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 35 టీఎస్ఆర్జేసీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 15 బాలురు, 20 బాలికల కాలేజీలు ఉండగా… ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి సీట్లను కేటాయిస్తారు.

ర్యాంకులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా… ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు 3 వేల వరకు సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. ప్ర‌వేశాల‌కు సంబంధించిన వివరాలను మే 24న విద్యార్థుల‌ మొబైల్స్‌కు సమాచారం అందుతుంది.

టీఎస్ఆర్జేసీ - 2025 ప్రవేశపరీక్షను మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహించారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్,​బైపీసీ విద్యార్థులకు బయోలజీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, ఎంఈసీ విద్యార్థులు ఇంగ్లిష్, సోషల్​ స్టడీస్​, మ్యాథ్స్​లో ప్రశ్నలు అడిగారు. ఈ ప్రవేశ పరీక్షను హైదరాబాద్ , రంగారెడ్డితో పాటు మరికొన్ని జిల్లాల్లో నిర్వహించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.