టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - టీజీఆర్‌జేసీ సెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదల, ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి-tgrjc cet 2025 entrance exam hall tickets released ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - టీజీఆర్‌జేసీ సెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదల, ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - టీజీఆర్‌జేసీ సెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదల, ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

టీజీ ఆర్‌జేసీ సెట్‌ 2025 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష మే 10వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం ఈ ఏడాది 74,614 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హత పొందిన వారికి గురుకుల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ 2025 హాల్ టికెట్లు విడుదల

టీఎస్‌ ఆర్‌జేసీ సెట్‌ - 2025 హాల్ టికెట్లు వచ్చేశాయ్. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా రాష్ట్రంలోని గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు. 2025 - 26 విద్యా సంవత్సరానికి గాను సీట్లు కేటాయి స్తారు. ఈ రాత పరీక్ష మే 10వ తేదీన నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసున్న అభ్యర్థులు tgrjc.cgg.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తికావటంతో… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

హాల్ టికెట్లు ఇలా పొందండి…

  1. అభ్యర్థులు https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో చివరల్లో కనిపించే డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  3. ఇక్కడ అభ్యర్థి రిఫరెన్స్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను లేదా పేరు లేదా, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  4. ఇక్కడ విద్యార్థి హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

రాష్ట్రంలో మొత్తం 35 టీఎస్ఆర్జేసీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 15 బాలురు, 20 బాలికల కాలేజీలు. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు 3 వేల వరకు సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది.

పరీక్షా విధానం ఇలా….

టీఎస్ఆర్జేసీ - 2025 ప్రవేశపరీక్షను మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా సబ్జెక్ట్ ప్రశ్నలు అడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్,​బైపీసీ విద్యార్థులకు బయోలజీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, ఎంఈసీ విద్యార్థులు ఇంగ్లిష్, సోషల్​ స్టడీస్​, మ్యాథ్స్​లో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రవేశ పరీక్షను హైదరాబాద్ , రంగారెడ్డితో పాటు మరికొన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.