టీజీ టెట్ - 2025కు దరఖాస్తు చేశారా...? గడువు ముగుస్తోంది, ముఖ్య వివరాలివే-tg tet 2025 online applications will close on april 30 key details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీజీ టెట్ - 2025కు దరఖాస్తు చేశారా...? గడువు ముగుస్తోంది, ముఖ్య వివరాలివే

టీజీ టెట్ - 2025కు దరఖాస్తు చేశారా...? గడువు ముగుస్తోంది, ముఖ్య వివరాలివే

తెలంగాణ టెట్ 2025 దరఖాస్తుల గడువు ముగుస్తోంది. మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.జూన్ 15 నుంచి పరీక్షలు ప్రారంభమైన....జూన్ 30వ తేదీతో ముగుస్తాయి.

తెలంగాణ టెట్ దరఖాస్తులు 2025

తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫస్ట్ టెట్ (జూన్ సెషన్) కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో పూర్తవుతుంది. మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అర్హులైన విద్యార్థులు... వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జూన్ 15 నుంచి పరీక్షలు….

తెలంగాణ టెట్ 2025 (జూన్ సెషన్) షెడ్యూల్ వివరాల ప్రకారం.... ఏప్రిల్ 30వ తేదీతో అప్లికేషన్లు ముగుస్తాయి. ఈలోపే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక పేపర్ కు రూ. 750 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌ 9 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. జూన్ 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీతో ముగుస్తాయి.

ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది. ప్రాథమిక కీలను ప్రకటించిన తర్వాత.... జూలై 22వ తేదీన టెట్‌ ఫలితాలను వెల్లడిస్తారు.

దరఖాస్తు ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 7032901383, 9000756178 నెంబర్లను సంప్రదింవచ్చు. అంతేకాకుండా తెలంగాణ టెట్ ఆఫీస్ ను సంప్రదించేందుకు 7093708883 / 7093708884 నెంబర్లకు కాల్ చేయవచ్చు.

మరోవైపు తెలంగాణ టెట్ పరీక్షల సిలబస్ కూడా అందుబాటులోకి వచ్చింది. టెట్ అభ్యర్థులు తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 15 పేపర్ల సిలబస్ వివరాలను అందుబాటులో ఉన్నాయి.

పరీక్షా విధానం….

తెలంగాణ టెట్ 2025 ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది. అయితే ఇందులో జనరల్‌ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగైతేనే టెట్ లో అర్హత సాధించినట్లు అవుతారు. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారు. ఇందులో స్కోర్ ఆధారంగా.... డీఎస్సీలో వెయిటేజీ వస్తుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.