టీజీ పాలిసెట్ 2025 దరఖాస్తులు - లేట్ ఫీజు లేకుండా మరికొన్ని గంటలే గడువు..! ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి-tg polycet 2025 online application will ends on april 19 know these details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీజీ పాలిసెట్ 2025 దరఖాస్తులు - లేట్ ఫీజు లేకుండా మరికొన్ని గంటలే గడువు..! ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

టీజీ పాలిసెట్ 2025 దరఖాస్తులు - లేట్ ఫీజు లేకుండా మరికొన్ని గంటలే గడువు..! ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

తెలంగాణ పాలిసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు శనివారం(ఏప్రిల్ 19)తో పూర్తవుతుంది. ఎలాంటి ఫైన్ లేకుండా రేపటిలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణ పాలిసెట్ 2025

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్‌ 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మరికొన్ని గంటల్లో పూర్తవుతుంది. అర్హులైన అభ్యర్థులు లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 19వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ తేదీ దాటితే ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. పాలిసెట్ కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. మిగతా అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్లించాలి.

మే 13న పాలిసెట్ పరీక్ష:

మే 13వ తేదీన టీజీ పాలిసెట్ 2025 పరీక్షను నిర్వహిస్తారు.పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు పరీక్ష జరిగిన 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ విడుదల చేస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానికులకు మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. 4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే లోకల్(స్థానికం)గా పరిగణిస్తారు.

దరఖాస్తు విధానం ఇలా:

  1. పాలిసెట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై నొక్కాలి. ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  3. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  4. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన వివరాలను ఎంట్రీ చేసి చివర్లో సబ్మిట్ చేయాలి.
  5. మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి ఈ కాపీని పొందవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ పాలిసెట్ - 2025 రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు…..

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం