ఎల్ఎల్ బీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు...ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగియగా… ప్రస్తుతం ఆలస్య రుసుంతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే రూ. 500 ఫైన్ తో ఇవాళ(మే 10) గడువు ముగియనుంది. తక్కువ ఫైన్ తో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
రూ. 500 ఆలస్య రుసుంతో గడువు దాటితే మరింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. ప్రస్తుతం ఈ ఫీజుతో పాటు ఫైన్ చెల్లించి…అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 1,000 ఆలస్యం రుసుంతో మే 15, రూ. 2 వేల ఫైన్ తో మే 20వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇక మే 25 వరకు రూ.4,000 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
టీజీ లాసెట్ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ మే 20, 2025 నుంచి అందుబాటులోకి వస్తుంది. మే 25, 2025 వరకు అవకాశం ఉంటుంది. 30 మే 2025వ తేదీన హాల్ టికెట్లు విడుదలవుతాయి.టీజీ లాసెట్ 2025 ప్రవేశ పరీక్ష 6 జూన్ 2025వ తేదీన జరుగుతుంది. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సుల ప్రవేశ పరీక్ష, మద్యాహ్నం ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ నిర్వహిస్తారు.
సంబంధిత కథనం