టీజీ లాసెట్ 2025 అభ్యర్థులకు అప్డేట్ - 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇలా రాసేయండి-tg lawcet 2025 mock test option is available on the official website direct link here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీజీ లాసెట్ 2025 అభ్యర్థులకు అప్డేట్ - 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇలా రాసేయండి

టీజీ లాసెట్ 2025 అభ్యర్థులకు అప్డేట్ - 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇలా రాసేయండి

తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఫ్రీగా మాక్ టెస్టులు రాసుకునే అవకాశం కల్పించారు. టీజీ లాసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పరీక్షలను రాసుకోవచ్చని సూచించారు.

టీజీ లాసెట్ - 2025

తెలంగాణ లాసెట్ 2025కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఉచితంగా మాక్ టెస్టులు రాసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీ లాసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పరీక్షలను రాసుకోవచ్చు. ఈ పరీక్షలను రాయటం ద్వారా… లాసెట్ పరీక్షా విధానంపై అభ్యర్థులకు ఓ అవగాహనకు రావొచ్చు.

టీజీ లాసెట్ - 2025 పరీక్ష ద్వారా మూడేళ్ల లా, ఐదేళ్ల లా కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లోనూ అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైన్ చెల్లించి అప్లయ్ చేసుకోవాలి.

మాక్ టెస్టులు ఇలా రాసుకోండి:

  • లాసెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు lawcet.tgche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Mock Test  ఆప్షన్ పై నొక్కి క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మూడేళ్ల లాసెట్ , ఐదేళ్ల లాసెట్,PGLCET ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు దరఖాస్తు చేసుకున్న ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ కావాలి. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ చూపించే క్వశ్చన్లకు ఆన్సర్స్ చూస్తూ ఈ టెస్టులను రాసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా ఈ మాక్ పరీక్షలను రాసే వీలు ఉంటుంది.

జూన్ 6న ఎంట్రెన్స్ ఎగ్జామ్….

టీజీ లాసెట్ - 2025కు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. ఆన్ లైన్ లో ఈ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇక ఆన్ లైన్ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ మే 20వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. మే 25 వరకు అవకాశం ఉంటుంది. ఇక మే 30వ తేదీన హాల్ టికెట్లు విడుదలవుతాయి. జూన్ 6వ తేదీన లాసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సుల ప్రవేశ పరీక్ష, మద్యాహ్నం ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎగ్జామ్ ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం