టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ 2025 : ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు - మీ అలాట్‌మెంట్‌ కాపీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి-tg icet 2025 special phase counselling seats allocated ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ 2025 : ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు - మీ అలాట్‌మెంట్‌ కాపీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి

టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ 2025 : ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు - మీ అలాట్‌మెంట్‌ కాపీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి

టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగానే ప్రత్యేక విడత ప్రవేశాల కింద సీట్లను కేటాయించారు. https://tgicet.nic.in/ లింక్ తో అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టీజీ ఐసెట్ కౌన్సెలింగ్

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. తాజాగానే ప్రత్యేక విడత ప్రవేశాల(స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్) కింద సీట్లను కేటాయించారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు టీజీ ఐసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ అర్డర్ కాపీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇప్పటివరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ ఏడాది చేరిన వారి సంఖ్య 30,371గా ఉంది. ఇంకా 7,489 సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 288 కాలేజీలు ఉండగా…. ఎంబీఏలో25,743 సీట్లు నిండాయి. ఇక ఎంసీఏలో 4,628 సీట్లు భర్తీ అయ్యాయి.

అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • టీజీ ఐసెట్ - 2025 అభ్యర్థులు https://tgicet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని క్యాడెంట్ లాగిన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
  • కాలేజీలో అడ్మిషన్ కోసం అలాట్ మెంట్ కాపీ తప్పనిసరిగా సమర్పించాలి.

స్పాట్ అడ్మిషన్లు ఎప్పుడంటే..?

ప్రత్యేక విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాగానే ఐసెట్ స్పాట్ అడ్మిషన్ల ప్రకటన రానుంది. ఈనెల 13వ తేదీన మార్గదర్శకాలను ప్రకటిస్తామని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. https://tgicet.nic.in/default.aspx వెబ్ సైట్ లో వివరాలను పొందుపరుస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం