రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. జూలై 7వ తేదీన రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రవి ఓ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 8, 9 తేదీలో ఐసెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలను కల్పిస్తారు.
పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tgche.ac.in/ వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి సీట్లను కేటాయిస్తారు. ర్యాంక్ ఆధారంగా వీటిని కేటాయిస్తారు. గతేడాది ఐసెట్ సీట్లకు బాగా డిమాండ్ కనిపించింది. ఈసారి కూడా అదే మాదిరిగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.