తెలంగాణ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఎంట్రెన్స్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అర్హత పొందిన పాలిటెక్నిక్ విద్యార్థులకు… బీటెక్ సెకండ్ ఇయర్ , బీఫార్మసీ సెకండ్ ఇయర్ లోకి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈసెట్ 2025లో అర్హత పొందిన వారికి కౌన్సెలింగ్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది.
తెలంగాణ ఈసెట్ 2025 స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి జులై 22వ తేదీన మార్గదర్శకాలను జారీ చేస్తారు. జూలై 29వ తేదీలోపు సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది.
సంబంధిత కథనం