తెలంగాణ ఈఏపీసెట్ 2025 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అగ్రికల్చర్ స్ట్రీమ్ హాల్ టికెట్లు అందుబాటులోకి రాగా… తాజాగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. ఇంజీనిరింగ్ స్ట్రీమ్ కోసం 2 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. రూ. 5 వేల ఫైన్ తో ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
అగ్రికల్చర్ స్ట్రీమ్ హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి వచ్చాయి ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు.
టీజీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలను 160 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. రాష్ట్రవ్యాప్తంగా 124 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
గత ఏడాది ఇంజినీరింగ్కు 2,54,750 మంది దరఖాస్తు చేయగా 2,40,617 మంది పరీక్ష రాశారు. ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేకపోవటంతో అప్లికేషన్ల సంఖ్య తగ్గింది. ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత… ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. ఆపై ఫలితాలను వెల్లడిస్తారు. అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేసి ప్రవేశాల ప్రక్రియను చేపడుతారు.
సంబంధిత కథనం