టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అలర్ట్ - 'ఇంజినీరింగ్' హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి-tg eapcet engineering stream hall ticket 2025 out here direct link to download admit card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అలర్ట్ - 'ఇంజినీరింగ్' హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అలర్ట్ - 'ఇంజినీరింగ్' హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

టీజీ ఈఏపీసెట్ 2025 పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. eapcet.tgche.ac.in వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో సూచించారు.

టీజీ ఈఏపీసెట్ - ఇంజినీరింగ్ హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అగ్రికల్చర్ స్ట్రీమ్ హాల్ టికెట్లు అందుబాటులోకి రాగా… తాజాగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

మే 2 నుంచి ఇంజినీరింగ్ పరీక్షలు…

మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షల‌ను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. ఇంజీనిరింగ్ స్ట్రీమ్ కోసం 2 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. రూ. 5 వేల ఫైన్ తో ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

అగ్రికల్చర్ స్ట్రీమ్ హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి వచ్చాయి ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు.

హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు eapcet.tgche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ హాల్ టికెట్ (E & AP) లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త పేజీలో ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడరిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషనల్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

టీజీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలను 160 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. రాష్ట్రవ్యాప్తంగా 124 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

గత ఏడాది ఇంజినీరింగ్‌కు 2,54,750 మంది దరఖాస్తు చేయగా 2,40,617 మంది పరీక్ష రాశారు. ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేకపోవటంతో అప్లికేషన్ల సంఖ్య తగ్గింది. ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత… ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. ఆపై ఫలితాలను వెల్లడిస్తారు. అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేసి ప్రవేశాల ప్రక్రియను చేపడుతారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం