TG EAPCET Results 2025 : తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్ - మీ స్కోర్, ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి-tg eapcet 2025 results declared here direct link to download rank card and marks ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Eapcet Results 2025 : తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్ - మీ స్కోర్, ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

TG EAPCET Results 2025 : తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్ - మీ స్కోర్, ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

టీజీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాల సీడీని ఆవిష్కరించారు. పరీక్షలు రాసిన విద్యార్థులు.. eapcet.tgche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదల (image source istock.com)

రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీఈఏపీసెట్‌ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాలను టీజీ ఈఏపీసెట్ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్ష ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో జరిగింది. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్ పరీక్షలు మే 2 నుంచి 4 వరకు నిర్వహించారు. మొత్తం 2,88,388 మంది పరీక్షలు రాశారు. వీరిలో అగ్రికల్చర్‌ స్ట్రీమ్ వాళ్లు… 81,198 మంది ఉన్నారు. ఇక ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ విద్యార్థులు…. 2,07,190 మంది ఉన్నారు. వీరంతా కూడా వారి మార్కులతో పాటు ర్యాంకులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టీజీ ఈఏపీసెట్ 2025 రిజల్ట్స్ - ఇలా చెక్ చేసుకోండి:

  1. టీజీ ఈఏపీసెట్-2025 పరీక్షలు రాసిన అభ్యర్థులు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. టీజీ ఈఏపీసెట్ రిజల్ట్స్- 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  4. ఇక్కడ మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ర్యాంకర్లు :

ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాల్లో ఏపీకి చెందిన భరత్ చంద్ర సత్తా చాటాడు. 150కిపైగా మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మూడో ర్యాంక్ కూడా ఏపీకి(విజయనగరం) చెందిన సూర్య కార్తీక్ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో ర్యాంక్ కృష్ణారెడ్డికి(రంగారెడ్డి జిల్లా) దక్కింది.

  1. భరత్ చంద్ర - 150 మార్కులు(పార్యతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్)
  2. కృష్ణా రెడ్డి - 148
  3. హమే సాయి సూర్య కార్తీక్ - 147 (విజయనగరం, ఆంధ్రప్రదేశ్)
  4. భార్గవ్ మెండే - 146
  5. వెంకట గణేశ్ - 144
  6. సాయి రిశాంత్ రెడ్డి - 143
  7. రిష్మిత్ బండారి - 142
  8. బని బ్రతా మాజీ - 141
  9. కొత్త ధనుష్ రెడ్డి - 140
  10. శ్రీ కార్తీక్ - 138

అగ్రికల్చర్ స్ట్రీమ్ ర్యాంకర్లు

  1. సాకేత్ రెడ్డి - 141 మార్కులు (మేడ్చల్ జిల్లా)
  2. లలిత్ - 140(కరీంనగర్)
  3. అక్షిత్ - 140
  4. సాయిచందర్ - 138
  5. బ్రహ్మణి - 138
  6. తేజాస్ - 137
  7. అకీరానంద్ రెడ్డి - 137
  8. భాను ప్రకాశ్ రెడ్డి - 136
  9. సాత్వీక్ - 136
  10. శివా రెడ్డి - 136

బాలికలదే పైచేయి - ఉత్తీర్ణత శాతం వివరాలు:

ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది.

అగ్రికల్చర్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... మొత్తం 81198 మంది విద్యార్థులు హాజరుకాగా...71309 మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది 87.82 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో బాలికలు 88.32 శాతం, బాలురు 86.29 శాతం ఉన్నారు.

టీజీ ఈఏపీసెట్-2025 ర్యాంకుల ఆధారంగా…. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ర్యాంక్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫలితాలు విడుదలైన నేపథ్యంలో… కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. వీటి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం