వచ్చే వారంలో తెలంగాణ టెట్ ఫలితాలు..! ఈ అప్డేట్స్ తెలుసుకోండి-telangana tet 2025 results likely to be released next week ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  వచ్చే వారంలో తెలంగాణ టెట్ ఫలితాలు..! ఈ అప్డేట్స్ తెలుసుకోండి

వచ్చే వారంలో తెలంగాణ టెట్ ఫలితాలు..! ఈ అప్డేట్స్ తెలుసుకోండి

వచ్చే వారంలో తెలంగాణ టెట్ ఫలితాలు 2025 విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాథమిక కీలపై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో తుది ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. అన్ని కుదిరితే ఈనెల 22వ తేదీన అందుబాటులోకి వస్తాయి.

తెలంగాణ టెట్ ఫలితాలు 2025

తెలంగాణ టెట్ - 2025 పరీక్షల (జూన్ సెషన్) ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా… వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. దీంతో తుది ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.

ఈనెల 22న ఫలితాలు…!

తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చే వారం వచ్చే అవకాశం ఉంది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే… జూలై 22వ తేదీన ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని ప్రక్రియలు పూర్తి కావటంతో… ఈ తేదీనే విడుదల చేస్తారని తెలుస్తోంది. ఒక వేళ ఏదైనా ఆలస్యమైనప్పటికీ.. ఒకటి రెండు రోజుల తేడాలోనే ప్రకటించే అవకాశం ఉంది.

జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా…. 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరయ్యారు. పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 మందికి దరఖాస్తు చేసుకోగా…. 41,207 మంది(76.73 శాతం) మంది హాజరయ్యారు. వీరంతా కూడా టెట్ తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

టీజీ టెట్ రిజల్ట్స్ - ఇలా చెక్ చేసుకోవచ్చు

  1. అభ్యర్థులు ముందుగా https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే తెలంగాణట్ టెట్ రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అభ్యర్థి జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ స్కోర్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ద్వారా రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

తెలంగాణ టెట్ 2025 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది. అయితే ఇందులో జనరల్‌ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. ఇందులో సాధించే స్కోర్ ఆధారంగా… డీఎస్సీ పరీక్షలో వేయిటేజీ కలుపుతారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం