Tue, 29 Apr 202505:00 PM IST
హెచ్.టి.తెలుగు పోర్టల్ నమోదు చేసుకోండి
తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలు 2025 కోసం విద్యార్థులు హెచ్.టి.తెలుగు పోర్టల్లో కూడా నమోదు చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న వారికి హెచ్.టి పోర్టల్లో ఫలితం అందుబాటులోకి వచ్చినప్పుడు వారి ఫోన్లకు అలర్ట్ వస్తుంది. ఈ లింక్ లో https://telugu.hindustantimes.com/telangana-board-10th-result వివరాలు నమోదు చేసుకోండి.
Tue, 29 Apr 202503:23 PM IST
2024 ఫలితాలు ఇలా
గత సంవత్సరం మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2024లో తెలంగాణ టెన్త్ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగగా, 5,08,385 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.
Tue, 29 Apr 202501:47 PM IST
తెలంగాణ టెన్త్ ఫలితాలు- గత ఉత్తీర్ణత శాతాలు
గత ఉత్తీర్ణత శాతాలు
2024- 91.31 శాతం
2023- 86.6 శాతం
2022- 90 శాతం
2021- 100 శాతం
2020- 100 శాతం
2019- 92.43 శాతం
2018- 83.78 శాతం
Tue, 29 Apr 202512:48 PM IST
తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలు 2025 - మార్కుల మెమోను ఎలా తనిఖీ చేయాలి?
Step 1: తెలంగాణ బీఎస్ఈ అధికారిక వెబ్సైట్లను bse.telangana.gov.in లేదా bseresults.telangana.gov.in ను సందర్శించండి.
Step 2: హోమ్పేజీలో SSC రిజల్ట్స్ 2025 అని కనిపించే లింక్పై క్లిక్ చేయండి
Step 3: పుట్టిన తేదీ (DOB), రోల్ నంబర్, కోడ్ వంటి రిజిస్టర్డ్ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి
Step 4: సబ్మిట్ బాక్స్పై క్లిక్ చేయండి. ఫలితం స్క్రీన్పై కనిపిస్తుంది.
Step 5: భవిష్యత్తు సూచన కోసం ఫలితాలను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
Tue, 29 Apr 202511:45 AM IST
మార్కుల మెమోలు ఇలా
గతంలో పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ ప్రింట్ చేస్తారు. చివరిగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా అనే వివరాలను ముద్రిస్తారు.
వీటితో పాటు బోధనేతర కార్యక్రమాలలో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించి గ్రేడ్లు మెమోలపై ముద్రిస్తారు
Tue, 29 Apr 202511:38 AM IST
రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఫలితాలు విడుదల
తెలంగాణ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతిలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం, మార్కుల మెమోల అంశంపై క్లారిటీ రావడంతో అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://telugu.hindustantimes.com/telangana-board-10th-result , https://bse.telangana.gov.in/లో ఒక్క క్లిక్తోనే పొందొచ్చు.
Tue, 29 Apr 202511:26 AM IST
రేపే పదో తరగతి పరీక్షా ఫలితాలు, అధికారిక ప్రకటన వచ్చేసింది
తెలంగాణ పదో తరగతి ఫలితాలను రేపు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈసారి గ్రేడింగ్ తో పాటు మార్కులు విడుదల చేయనున్నారు. విద్యార్థుల మోమోలలో సబ్జెక్టులవారీగా గ్రేడింగ్ తో పాటు మార్కులు విడుదల చేస్తారు. పలు ఎంట్రన్స్ ల వెయిటేజికి ఇబ్బందిగా మారకుండా మళ్లీ మార్కుల పద్ధతి అనుసరిస్తున్నారు.
తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Tue, 29 Apr 202511:21 AM IST
హెచ్.టి.తెలుగులో పది ఫలితాలు ఇలా తెలుసుకోండి
హెచ్.టి. తెలుగు (Hindustan Times Telugu) వెబ్సైట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలను చూడటానికి, మీరు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
1. హెచ్.టి. తెలుగు వెబ్సైట్ను సందర్శించండి. ఈ వెబ్సైట్ను సందర్శించడానికి https://telugu.hindustantimes.com/telangana-board-10th-result అనే URL ని ఉపయోగించవచ్చు.
2. పదో తరగతి ఫలితాల విభాగం కోసం చూడండి. వెబ్సైట్లో, "తెలంగాణ పదో తరగతి ఫలితాలు" లేదా "TG SSC Results" అనే విభాగం లేదా లింక్ కోసం వెతకండి.
3. ఫలితాలను చూడటానికి వెబ్ సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు ఫలితాలను చూసే పేజీకి వెళ్తారు.
4. ఆ పేజీలో, మీరు మీ ఫలితాలను ఎలా చూడాలనే దాని గురించి సూచనలు, మార్గదర్శకాలు చూస్తారు. సాధారణంగా, మీరు మీ హాల్ టికెట్ నంబర్ను లేదా మీ పేరు, ఇతర వివరాలను నమోదు చేయాలి.
5. మీ వివరాలను నమోదు చేసిన తర్వాత, మీ ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి.మీరు ఈ వెబ్సైట్లో ఫలితాలను ఎలా చూడాలో మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే, మీరు https://telugu.hindustantimes.com/telangana-board-10th-result వెబ్ సైట్ అప్డేట్ ఫాలో అవుతూ ఉండండి.
Tue, 29 Apr 202510:59 AM IST
అధికారి వెబ్ సైట్ లో ఫలితాలు
ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా, మొత్తం 2,650 కేంద్రాల్లో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ విద్యార్థులంతా ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా విద్యార్థులు మార్కులు, గ్రేడ్లను తెలుసుకోవచ్చు.
Tue, 29 Apr 202511:41 AM IST
రేపు మధ్యాహ్నం 1 గంటకు
అధికార వర్గాల సమాచారం మేరకు రేపు మధ్యాహ్నం 1 గంట రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు.
Tue, 29 Apr 202511:21 AM IST
తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నట్లు సమాచారం. అధికారుల ప్రాథమిక సమాచారం మేరకు రేపు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి ఫలితాలను హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ లో https://telugu.hindustantimes.com/telangana-board-10th-result చాలా సులభంగా, తొందరగా తెలుసుకోవచ్చు. బోర్డు ఫలితాలు విడుదల చేసిన క్షణాల్లోనే హెచ్.టి.తెలుగు పది ఫలితాలను అందిస్తుంది. ఎస్ఎస్సీ బోర్డు ఫలితాల ప్రకటన ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.