Wed, 30 Apr 202510:00 AM IST
వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు
1. ఎయిడెడ్(148)- 28
2. ఆశ్రమ(227) -126
3. బీసీ వెల్ఫేర్(261)- 143
4. ప్రభుత్వ పాఠశాలలు (497) - 73
5. కేజీబీవీ(475) - 230
6. మోడల్(194) - 79
7. ప్రైవేట్( 5063) - 2007(జీరో శాతం ఉత్తీర్ణత -2 పాఠశాలలు)
8. టీజీ రెసిడెన్షియల్(35) - 24
9. ఆర్ఈఎస్ MIN(204)- 91
10. ఎడబ్ల్యూఆర్(231) -108
11. టీడబ్ల్యూఆర్(103) - 45
12. జడ్పీ(4116) -1675
*బ్రాకెట్లలో మొత్తం పాఠశాలల సంఖ్య
మొత్తం 11,554 పాఠశాలల్లో 4,629 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. రెండు పాఠశాలలు జీరో ఉత్తీర్ణత నమోదు చేశాయి.
Wed, 30 Apr 202509:52 AM IST
మహబూబాబాద్ టాప్-వికారాబాద్ లాస్ట్
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మహబూబాబాద్ 99.29 శాతంతో అగ్రస్థానం సాధించింది. వికారాబాద్ 73.97 శాతం చివరి స్థానంలో ఉంది. మొత్తం 33 జిల్లాల్లో 4,96,374 మంది పరీక్షలకు హాజరవ్వగా...4,60,519 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2,28,608 మంది బాలురు, 2,31,911 మంది బాలుకలు ఉత్తీర్ణత సాధించారు.
Wed, 30 Apr 202509:44 AM IST
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలు
రీకౌంటింగ్
రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సబ్జెక్టుకు రూ. 500 చొప్పున పరీక్షా ఫలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోగా అంటే మే 15, 2025 లోపు ఎస్బీఐ బ్యాంకులో ఈ కింద తెలిపిన హెడ్ ఆఫ్ అకౌంట్ కు చలాన చెల్లించి, దరఖాస్తులను నేరుగా కానీ , పోస్టు ద్వారా సంబంధిత కార్యాలయాలకు పంపించాలి.
0202 - Education, Sports, Arts & Culture
01 - General Education
102 - Secondary Education
06 - Director of Government Exams
800 - User Charge
రీవెరిఫికేషన్, జవాబు పత్రం కాపీ కోసం
విద్యార్థులు తమ పాఠశాలలో హాల్ టికెట్ జిరాక్స్ కాపీ, కంప్యూటర్ ప్రింట్ మెమో కాపీతో పాటు రీ-వెరిఫికేషన్ దరఖాస్తును సమర్పించాలి. ప్రధానోపాధ్యాయుడు ఆన్ లైన్ ద్వారా అప్లోడ్ చేసిన, డీఈవో కార్యాలయానికి సమర్పించిన దరఖాస్తులు మాత్రమే అంగీకరిస్తారు. ఎస్ఎస్సీ బోర్డుకు పోస్టులో పంపిన దరఖాస్తులు అంగీకరించరు.
దరఖాస్తు ఫారమ్ ను S.S.C. బోర్డు వెబ్ సైట్ www.bse.telangana.gov.in లో ఉంచారు. ఈ దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి నుంచి కూడా పొందవచ్చు. విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 మెత్తాన్ని ఈ కింద హెడ్ ఆఫ్ అకౌంట్ కు మాత్రమే చలాన్ ద్వారా చెల్లించాలి.
0202 - Education, Sports, Arts & Culture
01 - General Education
102 - Secondary Education
06 - Director of Government Exams
800 - User
Wed, 30 Apr 202509:33 AM IST
సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు తేదీలు
1. విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లింపు చివరి తేదీ - 16.05.2025
2. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ద్వారా అనుసంధానించిన ఆన్ లైన్ లో పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ - 17.05.2025
3. ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్ ఎన్ఆర్ లతో సహా జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో సమర్పించడానికి చివరి తేదీ - 20.05.2025
4. జిల్లా విద్యాశాఖాధికారులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి ఎన్ఆర్ లు సమర్పించడానికి చివరి తేది- 22.05.2025
సంబంధిత సబ్జెక్టులో పరీక్ష ప్రారంభానికి 2 రోజుల ముందు వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.
Wed, 30 Apr 202509:20 AM IST
జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3, 2025 నుంచి జూన్ 13 వరకు ఉదయం గం. 09.30 నుంచి మధ్నాహ్నం గుం.12.30 వరకు నిర్వహించనున్నారు.
Wed, 30 Apr 202509:14 AM IST
బాలికలదే పైచేయి
తెలంగాణ పదో తరగతి పరీక్షలు 21.03.2025 నుంచి 03.04.2025 వరకు నిర్వహించారు. స్పాట్ వ్యాల్యూయేషన్ ఏప్రిల్ 7 నుంచి నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించారు. ఎస్ఎస్సీ మార్చి 2025 పరీక్షలకు 5,09,564 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
ఎస్ఎస్సీ మార్చి -2025 పరీక్షలకు మొత్తం 5,07,107 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 4,96,374 మంది విద్యార్థులు రెగ్యులర్ గా, 10,733 మంది విద్యార్థులు ప్రైవేట్ గా పరీక్షలకు హాజరయ్యారు. గత సంవత్సరం మొత్తం 5,05,813 (వారిలో 4,94,207 మంది రెగ్యులర్ గా, 11,606 మంది ప్రైవేట్ గా) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
పదో తరగతి ఫలితాల ముఖ్యాంశాలు
రెగ్యులర్ విద్యార్థులు
• రాష్ట్రంలో పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత శాతం 92.78 %
• బాలురు సాధించిన ఉత్తీర్ణత శాతం 91.32 % , బాలికల ఉత్తీర్ణత శాతం 94.26 %
• బాలికలు, బాలుర కుంటే 2.94 % అధికంగా ఉత్తీర్ణత శాతం సాధించారు.
Wed, 30 Apr 202509:02 AM IST
పదోతరగతి ఫలితాల్లో 92.78 శాతం మంది ఉత్తీర్ణత
తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
Wed, 30 Apr 202509:02 AM IST
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి 2025 పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు.
Wed, 30 Apr 202508:45 AM IST
రవీంద్ర భారతికి చేరుకున్న సీఎం, కాసేపట్లో ఫలితాలు విడుదల
సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి చేరుకున్నారు. కాసేపట్లో పది ఫలితాలు విడుదల చేయనున్నారు.
Wed, 30 Apr 202508:32 AM IST
కాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలకు అధికారులు అంతా సిద్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల కానున్నాయి.
Wed, 30 Apr 202508:32 AM IST
మార్కులు- గ్రేడులు ఇలా
పదో తరగతి మార్కులు- గ్రేడులు ఇలా
91-100 : ఏ1
81-90 : ఏ2
71-80 : బి1
61-70 : బి2
51-60 : సి1
41-50 : సి2
35-40 : డి
Wed, 30 Apr 202508:06 AM IST
కాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
కాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి చేరుకోనున్నట్లు సమాచారం.
Wed, 30 Apr 202507:55 AM IST
ఏప్రిల్ 15కే మూల్యాంకనం పూర్తి
ఏప్రిల్ 15వ తేదీకే పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయ్యింది. అయితే మెమోలపై మార్కులు, గ్రేడ్లు ఎలా అంశంపై విద్యాశాఖ నుంచి క్లారిటీ రాకపోవడంతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. తాజాగా ఈ విధానంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావడంతో అధికారులు ఫలితాలు విడుదలకు రంగం సిద్ధం చేశారు.
Wed, 30 Apr 202507:35 AM IST
తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఆలస్యం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయవాడలో ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహానికి సీఎం హాజరయ్యారు. సీఎం విజయవాడ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల విడుదల జాప్యం కానుంది. సాధారణంగా విద్యా శాఖ మంత్రి, ప్రభుత్వ పరీక్షల విభాగం ఏటా ఫలితాలను విడుదల చేసేది.
Wed, 30 Apr 202507:22 AM IST
సరికొత్త విధానంలో మార్కులు, గ్రేడ్లు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ట్ ల వారీగా మార్కులు, గ్రేడ్లను ముద్రించనున్నారు. అలాగే కొత్త మెమో నమూనాను విద్యాశాఖ విడుదల చేసింది. 2009 నుంచి గ్రేడింగ్ విధానం అమలులోకి ఉంది. తాజాగా ఈ విధానానికి స్వస్తి చెప్పారు. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్లను ఇచ్చేవారు.
సబ్జెక్ట్ల వారీగా గ్రేడ్లతో పాటు మొత్తంగా సీజీపీఏ ఇచ్చేవారు. ఇప్పుడు గ్రేడ్ల విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
Wed, 30 Apr 202507:18 AM IST
2650 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 2,650 కేంద్రాల్లో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ విద్యార్థులంతా ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టగా.... ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేశారు.
Wed, 30 Apr 202507:28 AM IST
మధ్యాహ్నం గం. 2.15 లకు పదో తరగతి ఫలితాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో పదో తరగతి ఫలితాలు విడుదల కాస్త ఆలస్యం కానుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం.
పది ఫలితాలు మొదట మధ్యాహ్నం 1 గంటలకు అని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సీఎం వివాహ శుభకార్యాలకు అటెండ్ అవుతున్న కారణంగా గంట పదిహేను నిముషాలు ఫలితాలను వాయిదా వేశారు అధికారులు. ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
Wed, 30 Apr 202506:50 AM IST
విజయవాడలో తెలంగాణ సీఎం, ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం
తెలంగాణ సీఎం రేవంత్ విజయవాడ పర్యటనలో ఉన్నారు. మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమా మహేశ్వర రావు కుమారుడి వివాహానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి విజయవాడ పర్యటన నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Wed, 30 Apr 202506:41 AM IST
మధ్యాహ్నం 1.15 ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫలితాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
Wed, 30 Apr 202506:12 AM IST
మరికాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తారు. విజయవాడ నుంచి నేరుగా రవీంద్ర భారతి చేరుకుంటారు. ఈ ఏడాది దాదాపు 5లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
Wed, 30 Apr 202505:45 AM IST
ఈ ఏడాది మార్కులు కూడా విడుదల…
గతంలో పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ ప్రింట్ చేస్తారు. చివరిగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా అనే వివరాలను ముద్రిస్తారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ తాజాగా స్పష్టం చేసింది.
Wed, 30 Apr 202505:39 AM IST
పాస్ మార్కులు ఇలా..
తెలంగాణ పది పరీక్షల్లో ఆరు సబ్జెక్టులకు కలిపి 600 మార్కులకు పరీక్షలు జరిగాయి. ఒక్కో సబ్జెక్ట్లో రాత పరీక్షకు 80మార్కులు, ఇంటర్నల్ లో 20 మార్కులు కేటాయిస్తారు. హిందీలో రాత పరీక్షలో 16 రావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణతకు ఇంటర్నల్తో కలిపి 20 రావాల్సి ఉంటుంది. ఇతర సబ్జెక్టుల్లో రాత పరీక్షల్లో 28 మార్కులు, ఇంటర్నల్ మార్కులతో కలిపి 35 రావాల్సి ఉంటుంది.
Wed, 30 Apr 202505:33 AM IST
పదో తరగతిలో గ్రేడ్లు ఇలా..
పదో తరగతి పరీక్షల్లో 91-100 మార్కులు సాధించిన వారికి ఏ1 గ్రేడ్, 81-90మార్కులు వస్తే ఏ2, 71-80 మార్కులకు బి1, 61-70 మార్కులకు బి2, 51-60 మార్కులకు సి1, 41-50 మార్కులకు సి2, 35-40 మార్కులకు డి గ్రేడ్ ఇస్తారు.
Wed, 30 Apr 202505:26 AM IST
HT తెలుగులో తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు
HT తెలుగులో తెలంగాణ టెన్త్ 2025 ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-10th-result
SSC బోర్డు వెబ్ సైట్ లోనూ ఫలితాలు
తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాలను పదో తరగతి బోర్డు వెబ్ సైట్ https://bse.telangana.gov.in లోనూ పొందవచ్చు. తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్కుల కాపీని పొందవచ్చు.
Wed, 30 Apr 202505:15 AM IST
హెచ్టీ తెలుగులో ఫలితాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి సింగిల్ క్లిక్ తోనే మార్కుల
గతంలో పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ ప్రింట్ చేస్తారు. చివరిగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా అనే వివరాలను ముద్రిస్తారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ తాజాగా స్పష్టం చేసింది. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result
Wed, 30 Apr 202505:14 AM IST
మరికాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తయిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా... ఏప్రిల్ మూడో వారం నాటికి మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక అంశాలను పూర్తి చేశారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి.... ఫలితాల వెల్లడి తేదీని అధికారులు ప్రకటించారు.
Wed, 30 Apr 202504:12 AM IST
నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి ఫలితాలు మధ్యాహ్నం 1 గంటకు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
Wed, 30 Apr 202503:53 AM IST
మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల కానున్నాయి. రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాలను హెచ్టీ తెలుగులో నేరగా తెలుసుకోవచ్చు. ఈ లింకును ఫాలో అవ్వండి.. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result
Wed, 30 Apr 202502:58 AM IST
తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఇలా తెలుసుకోండి…
HT తెలుగులో తెలంగాణ టెన్త్ 2025 ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-10th-result
SSC బోర్డు వెబ్ సైట్ లోనూ ఫలితాలు
తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాలను పదో తరగతి బోర్డు వెబ్ సైట్ https://bse.telangana.gov.in లోనూ పొందవచ్చు. తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్కుల కాపీని పొందవచ్చు.
Wed, 30 Apr 202502:20 AM IST
పరీక్షలకు హాజరైన 5లక్షల మంది విద్యార్థులు
ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 2,650 కేంద్రాల్లో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ విద్యార్థులంతా ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టగా.... ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేశారు.
Wed, 30 Apr 202502:05 AM IST
గత ఏడాది ఫలితాలు ఇలా..
గతేడాది ఏప్రిల్ 2తో పదో తరగతి పరీక్ష ఫలితాలు పూర్తి కాగా…. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఈసారి కూడా ఏప్రిల్ 30వ తేదీనే ప్రకటిస్తున్నారు. ఫలితాలను ప్రకటించిన వెంటనే సప్లిమెంటరీ పరీక్ష తేదీలతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీల వివరాలను ప్రకటిస్తారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు.... ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Wed, 30 Apr 202501:36 AM IST
హిందీలో 16 వస్తే పాస్…?
తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో ఆరు సబ్జెక్టులకు కలిపి 600 మార్కులకు పరీక్షలు జరిగాయి. ఒక్కో సబ్జెక్ట్లో రాత పరీక్షకు 80మార్కులు, ఇంటర్నల్ లో 20 మార్కులు కేటాయిస్తారు. హిందీలో రాత పరీక్షలో 16 రావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణతకు ఇంటర్నల్తో కలిపి 20 రావాల్సి ఉంటుంది. ఇతర సబ్జెక్టుల్లో రాత పరీక్షల్లో 28 మార్కులు, ఇంటర్నల్ మార్కులతో కలిపి 35 రావాల్సి ఉంటుంది.
Wed, 30 Apr 202501:36 AM IST
పదిలో గ్రేడులు ఇలా ఇస్తారు.
తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో 91-100 మార్కులు సాధించిన వారికి ఏ1 గ్రేడ్, 81-90మార్కులు వస్తే ఏ2, 71-80 మార్కులకు బి1, 61-70 మార్కులకు బి2, 51-60 మార్కులకు సి1, 41-50 మార్కులకు సి2, 35-40 మార్కులకు డి గ్రేడ్ ఇస్తారు.
Wed, 30 Apr 202501:23 AM IST
పదో తరగతి ఫలితాలు తెలుసుకోండి ఇలా
HT తెలుగులో తెలంగాణ టెన్త్ 2025 ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-10th-result
SSC బోర్డు వెబ్ సైట్ లోనూ ఫలితాలు
తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాలను పదో తరగతి బోర్డు వెబ్ సైట్ https://bse.telangana.gov.in లోనూ పొందవచ్చు.
Wed, 30 Apr 202512:57 AM IST
మార్కుల మెమోలలో కీలక మార్పులు
గతంలో పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ ప్రింట్ చేస్తారు. చివరిగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా అనే వివరాలను ముద్రిస్తారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ తాజాగా స్పష్టం చేసింది.
Wed, 30 Apr 202512:45 AM IST
తెలంగాణలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవింద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో ఫలితాలను విడుదల చేస్తారు.
Wed, 30 Apr 202512:08 AM IST
పూర్తైన మూల్యాంకనం
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వరకు తెలంగాణలో టెన్త్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తయిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా... ఏప్రిల్ మూడో వారం నాటికి మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు.
Wed, 30 Apr 202512:06 AM IST
రవీంద్ర భారతిలో ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి ఫలితాలను రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విడుదల చేస్తారు. ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్తో పాటు హిందుస్తాన్ టైమ్స్లో కూడా తెలుసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result
Wed, 30 Apr 202512:05 AM IST
మార్చిలో జరిగిన పరీక్షలు
తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result
Wed, 30 Apr 202512:04 AM IST
విద్యార్థులకు మార్కులతో పాటు గ్రేడ్లు
తెలంగాణలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులకు మార్కులతో పాటు గ్రేడ్లు కూడా అందిస్తారు. ఫలితాలను ఈ లింకు ద్వారా పొందండి. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result
Wed, 30 Apr 202512:00 AM IST
తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాలు
తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. నేడు మధ్యాహ్నం 1 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
Wed, 30 Apr 202511:59 PM IST
తెలంగాణ పదో తరగతి ఫలితాలను హెచ్టీ తెలుగులో తెలుసుకోవచ్చు.
తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఈ లింకును అనుసరించండి. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result