తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రేపు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్ష ఆధారంగా… మెరిట్ సాధించిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
టీజీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఆధారంగా…. రాష్ట్రంలోని 194 ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రేపు (ఏప్రిల్ 27) ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఇదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 2025 - 2026 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు… 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది.
మండల కేంద్రాల్లోని ఆదర్శ పాఠశాలలే ఎగ్జామ్ సెంటర్లుగా ఉంటాయి. ఇక ఈ ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులకు మాత్రమే సీట్లు కేటాయిస్తారు. https://telanganams.cgg.gov.in వెబ్ సైట్ లోనే ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు.
ఈ ఎంట్రెన్స్ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉండగా.... మొత్తం 4 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు.
మే 28వ తేదీన రాత పరీక్ష ఫలితాలను ప్రకటిస్తారు.మే 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ద్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభమవుతాయి.
సంబంధిత కథనం