తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు - రేపే ఎంట్రెన్స్ ఎగ్జామ్-telangana model schools entrance exam to be held tomorrow for admissions ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు - రేపే ఎంట్రెన్స్ ఎగ్జామ్

తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు - రేపే ఎంట్రెన్స్ ఎగ్జామ్

తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు రేపు (ఏప్రిల్ 27) ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా… రాష్ట్రంలోని 194 ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పిస్తారు.

తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు (TG School Education)

తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రేపు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్ష ఆధారంగా… మెరిట్ సాధించిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.

టీజీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఆధారంగా…. రాష్ట్రంలోని 194 ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రేపు (ఏప్రిల్ 27) ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఇదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2025 - 2026 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు… 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది.

హాల్ టికెట్లు ఇలా డౌన్లోండ్ చేసుకోండి:

  1. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు telanganamS.cgg.gov. in వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి.
  2. హాల్ టికెట్ ఆప్షన్ పై నొక్కాలి. అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఐడీ లేదా పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  3. సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  4. మొబైల్ నెంబర్ లేదా అభ్యర్థి పేరు ఆధారంగా కూడా హాల్ టికెట్లు పొందవచ్చు.

మండల కేంద్రాల్లోని ఆదర్శ పాఠశాలలే ఎగ్జామ్ సెంటర్లుగా ఉంటాయి. ఇక ఈ ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులకు మాత్రమే సీట్లు కేటాయిస్తారు. https://telanganams.cgg.gov.in వెబ్ సైట్ లోనే ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు.

ఈ ఎంట్రెన్స్ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉండగా.... మొత్తం 4 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు.

మే 28వ తేదీన రాత పరీక్ష ఫలితాలను ప్రకటిస్తారు.మే 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ద్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభమవుతాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం