రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో(ఆదర్శ పాఠశాలలు) ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మార్చి 20వ తేదీతో పూర్తి కానుంది. ఇప్పటికే పలుమార్లు అధికారులు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. అర్హులైన విద్యార్థులు... వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 2025 - 2026 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఇక ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. ఏప్రిల్ 13వ తేదీన పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీని ఏప్రిల్ 20కి వాయిదా వేశారు. ఏప్రిల్ 15 తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు రుసుం కింద ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఏప్రిల్ 20, 2025వ తేదీన జరుగుతుంది.
ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.ఇక 7 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు… మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లోని ఆదర్శ పాఠశాలలు ఎగ్జామ్ సెంటర్లుగా ఉంటాయి.
సంబంధిత కథనం