తెలంగాణ ఈసెట్ ఫలితాల విడుదలపై అప్డేట్ వచ్చింది. టీజీ ఈసెట్-2025 ఫలితాలు రేపు(మే 25) విడుదల చేయనున్నట్లు...ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు ఉస్మానియా వర్సిటీలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, ఉస్మానియా వర్సిటీ వీసీ కుమార్ ఈసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మే 12న ఈసెట్ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఈసెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. ఈసెట్లో అర్హత సాధించిన పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈసెట్ ఫలితాలను https://ecet.tgche.ac.in/ లో తెలుసుకోవచ్చు.
మే 12న ఈసెట్ పరీక్షను నిర్వహించారు. మే 14 నుంచి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటారు. మే 16 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించారు. రాష్ట్రంలోని 86 పరీక్ష కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న 19,672 మందికి 18,928 మంది (96.22%) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఈసెట్ అర్హత సాధించడానికి 25% మార్కులు అంటే 200లో 50 మార్కులు రావాలి. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ నిబంధన లేదు. ఈసెట్ ఫలితాల విడుదిల అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్ వెల్లడించనున్నారు.
సంబంధిత కథనం