ఇంటర్మీడియట్ విద్యార్థులకు అధికారులుకు మరో అప్డేట్ ఇచ్చారు. ఫీజు చెల్లించుకోలేని విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 31వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఈ గడువు డిసెంబర్ 17వ తేదీతోనే పూర్తి కాగా… తాజాగా డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు. ఇక రూ.2 వేల ఆలస్య రుసుముతో జనవరి 2వరకు ఫీజులు చెల్లించవచ్చు.
ఇంటర్ ఫస్టియర్ జనరల్ రెగ్యులర్ కోర్సుల ఫీజును రూ.520గా నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రెగ్యులర్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750గా ఉంది. ఇంటర్ సెకండియర్ జనరల్ ఆర్ట్స్ కోర్సుల ఫీజు రూ.520, సెకండియర్ జనరల్ సైన్స్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750గా ఉంది. సెకండియర్ ఒకేషనల్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750 చెల్లించాలి. వీటికి తోడు ఆలస్య రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 3, 2025 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 22, 2025తో పూర్తి అవుతాయి. రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు… మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. ఇక తుది పరీక్షల టైం టేబుల్ ను కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం