తెలంగాణ బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎంట్రెన్స్ పరీక్ష లేకుండానే..!-telangana bc gurkula inter admission 2025 updates online application last date extended ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎంట్రెన్స్ పరీక్ష లేకుండానే..!

తెలంగాణ బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎంట్రెన్స్ పరీక్ష లేకుండానే..!

తెలంగాణలోని బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు(మే 12) దగ్గరపడటంతో… అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులు మే 17వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించారు.

బీసీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

తెలంగాణలోని మహాత్మ పూలే బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల కొనసాగుతుండగా… ఈ గడువు మే 12వ తేదీతో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులు మే 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలు…

ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష లేకుండా సీట్లను భర్తీ చేస్తారు.

కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మెరిట్ తో పాటు రిజర్వేషన్లను ప్రమాణికంగా తీసుకుంటారు. వీటి ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ ఈసీతో పాటు వొకేషనల్ కోర్సుల్లో కూడా సీట్ల భర్తీని చేపడుతారు. ఇందులో సీట్లు పొందే విద్యార్థులకు నీట్, ఎంసెట్, ఐఐటీ, సీఏ, సీపీటీ లేదా క్లాట్ కోచింగ్ కూడా ఇస్తారు. అంతేకాకుండా విద్యార్థులకు హాస్టల్ సదుపాయం ఉంటుంది. ఆధునాతమైన ల్యాబ్స్ తో పాటు సరైన వసతులు కల్పిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 130 జూనియర్‌ కాలేజీల్లో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్‌ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 040-23328266 నెంబర్ ను సంప్రదించవచ్చు.

దరఖాస్తు విధానం….

అర్హులైన విద్యార్థులు https://mjpabcwreis.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి. ఇందుకు రూ. 200 ఫీజు చెల్లంచాలి. బీసీ విద్యార్థులకు ఫీజు ఉండదు. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. ఫీజు జర్నల్ నెంబర్, టెన్త్ హాల్ టికెట్ నెంబర్ తో పాటు ఇతర వివరాల ఆధారంగా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.ృ

మెరిట్ ఆధారంగా సీట్లు పొందే విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో టీసీ, పదో తరగతి మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయపు ధ్రువీకరణపత్రం, ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్, పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, మూడు సెట్ల జిరాక్స్ కాపీలను ఇవ్వాలి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.