టీ-శాట్ టెట్ ప్రత్యేక తరగతులు - ముఖ్య వివరాలు:
- జూన్ 15 నుంచి తెలంగాణ టెట్ 2025 పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీతో ముగుస్తాయి.
- ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది.
- ప్రాథమిక కీలను ప్రకటించిన తర్వాత.... జూలై 22వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడిస్తారు.
- మే ఆరో తేదీ నుంచి టీ-శాట్ నిపుణ ఛానల్ లో ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి.
- ప్రధాన సబ్జెక్స్ కు సంబంధించి నలుగురు ఎక్స్ పర్ట్స్ పాల్గొంటారు. పరీక్షలో ప్రధానంగా ఎదుర్కోబోయే సమస్యలు, సమయ పాలన, పరీక్ష రాసే విధానం తదితర జాగ్రత్తలు సబ్జెక్టుల వారీగా వివరిస్తారు.
- టీ-శాట్అరగంట నిడివిగల ప్రత్యేక పాఠ్యాంశాలను సుమారు 200 ఎపిసోడ్స్ సిద్ధం చేసి ప్రసారం చేస్తున్నారు.
- టీ-శాట్ విద్య ఛానల్ లో ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు, నిపుణ ఛానల్ లో సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రసారాలు కొనసాగుతున్నాయి.
- టెట్ పరీక్ష రెండు పేపర్లకు సంబంధించి లాంగ్వేజెస్ తో పాటు పెడగాజీ, ఎన్విరాన్ మెంట్ సైన్స్, ఛైల్డ్ డెవెలప్ మెంట్ తదితర సబ్జెక్టులలో వీడియో పాఠ్యాంశాలను ప్రసారం చేస్తారు.
- టీ -శాట్ అందించే కంటెంట్ ను సద్వినియోగం చేసుకుని, డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ సందేహాలకు సమాధానాల కోసం 040-23540326 / 726 టోల్ ఫ్రీ 1800 425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
తెలంగాణ టెట్ 2025 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది. అయితే ఇందులో జనరల్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. ఇందులో సాధించే స్కోర్ ఆధారంగా… డీఎస్సీ పరీక్షలో వేయిటేజీ కలుపుతారు.