12వ తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు- SSC CHSL 2025 రిజిస్ట్రేషన్​ మొదలు..-ssc chsl 2025 registration for 3131 vacancies begins check details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  12వ తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు- Ssc Chsl 2025 రిజిస్ట్రేషన్​ మొదలు..

12వ తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు- SSC CHSL 2025 రిజిస్ట్రేషన్​ మొదలు..

Sharath Chitturi HT Telugu

SSC CHSL 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. 3000కుపైగా ఖాళీలాకు ఈసారి ఎంపిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ 2025 రిజిస్ట్రేషన్​ (Unsplash)

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్​ఎస్​ఎల్​) పరీక్ష 2025 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్సీ).. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 18 లోపు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా SSC CHSL 2025కి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ 2025- ముఖ్యమైన తేదీలు, వివరాలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూన్ 23 నుంచి జులై 18 (రాత్రి 11 గంటల వరకు)
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: జులై 19 (రాత్రి 11 గంటల వరకు)
  • దరఖాస్తు ఫారమ్ సవరణ, సవరణ ఛార్జీల చెల్లింపు తేదీలు: జులై 23 నుంచి 24 (రాత్రి 11 గంటల) వరకు
  • టైర్-I (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) తేదీలు: సెప్టెంబర్ 8 నుంచి 18
  • టైర్-II (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) తేదీలు: ఫిబ్రవరి-మార్చి, 2026

దరఖాస్తు ఫారమ్ నింపడంలో ఏమైనా సమస్యలు ఉంటే సంప్రదించాల్సిన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 18003093063

  • ఎస్​ఎస్సీ అభ్యర్థులకు అలర్ట్​! పరీక్ష రాయాలంటే ఓటీఆర్​ మస్ట్​- పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ 2025- ఖాళీలు, వయోపరిమితి, అర్హతలు..

ఈ సంవత్సరం ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ ద్వారా సుమారు 3,131 ఖాళీల భర్తీ జరగనుంది. ఖాళీల తుది సంఖ్య త్వరలో వెల్లడి కానుంది. పోస్ట్, కేటగిరీ వారీగా ఖాళీల వివరాలను ఎస్​ఎస్సీ తన వెబ్‌సైట్ ssc.gov.inలో త్వరలో తెలియజేస్తుంది. రాష్ట్రాల వారీగా, జోన్ల వారీగా ఖాళీల వివరాలు తమ వద్ద ఉండవని, ఈ సమాచారం కోసం సంబంధిత యూజర్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాలని కమిషన్ అభ్యర్థులకు సూచించింది.

ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ 2025- వయోపరిమితి..

జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, జనవరి 2, 1999కి ముందు, జనవరి 1, 2008 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. నిబంధనల ప్రకారం రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ 2025- విద్యార్హతలు..

డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ‘ఏ’ (మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్​ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్టులకు): సైన్స్ స్ట్రీమ్‌లో గణితం ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎల్​డీసీ/జేఎస్​ఏ, డీఈఓఏ/డీఈఓ గ్రేడ్ ‘A’ (డిపార్ట్‌మెంట్/మినిస్ట్రీలలోని డీఈఓలు మినహా): ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారు జనవరి 1, 2026 నాటికి తప్పనిసరిగా అవసరమైన విద్యార్హతను కలిగి ఉండాలి.

ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ 2025- దరఖాస్తు ఫీజు..

ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ 2025 దరఖాస్తు ఫీజు రూ. 100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూబీడీ, రిజర్వేషన్‌కు అర్హులైన ఎక్స్-సర్వీస్‌మెన్ (ఈఎస్​ఎం) అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.

మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు ఎస్​ఎస్సీ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం