స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ సీజీఎల్ ఎగ్జామ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూలై 4, 2025న ముగించనుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, 2025 కు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు చివరితేదీ 5 జూలై 2025. కరెక్షన్ విండో జూలై 9న ప్రారంభమై జూలై 11, 2025న ముగుస్తుంది.
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 టైర్-1 పరీక్ష 2025 ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు, టైర్-2 పరీక్ష 2025 డిసెంబర్ లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా 14582 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో ఉన్న డీటెయిల్డ్ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులందరూ ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
ఈ పరీక్షకు దరఖాస్తు చేయడానికి ఫీజు రూ.100. రిజర్వేషన్ కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. భీమ్ యుపిఐ, నెట్ బ్యాంకింగ్ లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.
సంబంధిత కథనం