SEBI recruitment 2025 : సెబీలో ఆఫీసర్​ గ్రేడ్​ ఏ పోస్టుల భర్తీకి రిక్రూట్​మెంట్​- వివరాలు ఇలా..-sebi recruitment 2025 for 110 officer grade a posts check details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Sebi Recruitment 2025 : సెబీలో ఆఫీసర్​ గ్రేడ్​ ఏ పోస్టుల భర్తీకి రిక్రూట్​మెంట్​- వివరాలు ఇలా..

SEBI recruitment 2025 : సెబీలో ఆఫీసర్​ గ్రేడ్​ ఏ పోస్టుల భర్తీకి రిక్రూట్​మెంట్​- వివరాలు ఇలా..

Sharath Chitturi HT Telugu

ఆఫీసర్​ గ్రేడ్​ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ని విడుదల చేసింది సెబీ. త్వరలోనే రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభంకానుంది. రిక్రూట్​మెంట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

సెబీ రిక్రూట్​మెంట్​ 2025 వివరాలు.. (PTI)

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్​ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆఫీసర్ గ్రేడ్ 'ఏ' (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్​ని తాజాగా విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్‌సైట్ sebi.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సంస్థలో మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రిక్రూట్​మెంట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సెబీ రిక్రూట్​మెంట్​ 2025- ముఖ్యమైన తేదీ..

వివరాలతో కూడిన అధికారిక ప్రకటన, ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అక్టోబర్ 30, 2025న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే.. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఫీజు తదితర వివరాల కోసం కింద చదవండి.

పోస్టుల వివరాలు..

మొత్తం 110 పోస్టులలో వివిధ విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  • జనరల్: 56 పోస్టులు
  • లీగల్: 20 పోస్టులు
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 22 పోస్టులు
  • రీసెర్చ్: 4 పోస్టులు
  • అధికార భాష: 3 పోస్టులు
  • ఇంజనీరింగ్: 5 పోస్టులు

వయో పరిమితి..

సెబీ రిక్రూట్​మెంట్​ 2025 కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయస్సు సెప్టెంబర్ 30, 2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. అంటే, అభ్యర్థి అక్టోబర్ 01, 1995 తర్వాత జన్మించి ఉండాలి. వర్తించే నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..

సెబీ రిక్రూట్​మెంట్​ 2025 ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది:

ఫేజ్ I: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఇది ఆన్‌లైన్ పరీక్ష1

ఫేజ్ II: ఫేజ్ I లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఫేజ్ II పరీక్షకు హాజరవుతారు. ఇది కూడా రెండు పేపర్లు గల ఆన్‌లైన్ పరీక్ష రూపంలో ఉంటుంది.

ఇంటర్వ్యూ: ఫేజ్ II లో ఎంపికైన అభ్యర్థులను చివరిగా ఇంటర్వ్యూకి పిలుస్తారు.

దరఖాస్తు ఫీజు..

సెబీ రిక్రూట్​మెంట్​ 2025 దరఖాస్తుకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము, సమాచార ఛార్జీలు కలిపి రూ. 1000/- + 18% జీఎస్‌టీ.

ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులకు సమాచార ఛార్జీలుగా రూ. 100/- + 18% జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఫీజు చెల్లింపును ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే చేయాలి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం