బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కీలక అలర్ట్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హులైన అభ్యర్థులు sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో భాగంగా సంస్థలో 150 పోస్టులను భర్తీ చేయనుంది ఎస్బీఐ.
జనవరి 3న ప్రారంభమైన ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 జనవరి 23న ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అర్హత, ఎంపిక విధానంతో పాటు ఇతర వివరాల కోసం కింద చదవండి..
ఎస్బీఐ ఎస్సీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా అనుసంధాన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగం) పూర్తి చేసి, ఐఐబీఎఫ్ ద్వారా ఫారెక్స్లో సర్టిఫికేట్ (సర్టిఫికేట్ తేదీ 31.12.2024 నాటికి ఉండాలి) పొంది ఉండాలి.
ఎంపిక ప్రక్రియలో షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. కేవలం ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికకు మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులు (కటాఫ్ పాయింట్ వద్ద కామన్ మార్కులు) సాధిస్తే, అలాంటి అభ్యర్థులకు మెరిట్లో వారి వయస్సును బట్టి ర్యాంకులు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి.
ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ 2025 కోసం.. జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు/ ఇన్ఫర్మేషన్ ఛార్జీలు ఉండవు.
డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి స్క్రీన్పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఆన్లై పేమెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఏవైనా ఉంటే అభ్యర్థులే భరించాలి.
వివరణాత్మక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం