విద్యార్థులకు రూ. 20లక్షల వరకు ఆర్థిక భరోసా! SBI scholarship 2025 వివరాలు..-sbi scholarship 2025 applications begin check full details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  విద్యార్థులకు రూ. 20లక్షల వరకు ఆర్థిక భరోసా! Sbi Scholarship 2025 వివరాలు..

విద్యార్థులకు రూ. 20లక్షల వరకు ఆర్థిక భరోసా! SBI scholarship 2025 వివరాలు..

Sharath Chitturi HT Telugu

విద్యార్థులకు రూ. 20లక్షల వరకు ఆర్థిక భరోసాను అందిస్తోంది ఎస్బీఐ. ఈ మేరకు SBI scholarship 2025 స్కీమ్​ని ప్రారంభించింది. ఈ స్కాలర్​షిప్​ కోసం అర్హత, అప్లికేషన్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

విద్యార్థులకు రూ. 20లక్షల వరకు ఆర్థిక భరోసా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విద్యార్థుల కోసం రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్ ఇచ్చే సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మెరిట్ ఉన్న విద్యార్థులు తమ చదువులకు ఆర్థిక భరోసా పొందవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు మార్కుల్లో 10 శాతం సడలింపు ఉంటుంది. అంతేకాకుండా, మహిళలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు చెరో 50% సీట్లు కేటాయించడం విశేషం. ఈ నేపథ్యంలో ఎస్బీఐ స్కాలర్​షిప్​ 2025కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్బీఐ స్కాలర్​షిప్​ 2025- వివరాలు..

ఈ పథకాన్ని 'ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2025-26' పేరుతో ఎస్బీఐ ప్రారంభించింది. స్కూల్ విద్యార్థులు, అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, మెడికల్, ఐఐటీ, ఐఐఎం, విదేశాల్లో చదివే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు, వారి చదువు స్థాయిని బట్టి రూ. 15,000 నుంచి రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది.

ఆదాయం, చివరి తేదీ-

స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే స్కూల్ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదు. ఇతర కోర్సుల విద్యార్థులకు ఈ ఆదాయ పరిమితి రూ. 6 లక్షలు. ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 15, 2025.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసేటప్పుడు ఈ కింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:

  • మార్క్స్ షీట్
  • గుర్తింపు కార్డు
  • ఆర్థిక పత్రాలు (ప్రస్తుత సంవత్సరం ఫీజు రసీదు, బ్యాంక్ అకౌంట్ వివరాలు)
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • అడ్మిషన్ ప్రూఫ్
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • కులం సర్టిఫికెట్

దరఖాస్తు విధానం

స్టెప్​ 1- ఎస్బీఐ స్కాలర్​షిప్​ 2025 కోసం ముందుగా, బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbiashascholarship.co.inను సందర్శించాలి.

స్టెప్​ 2- హోమ్‌పేజీలో ఉన్న 'అప్లై నౌ' బటన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్​ 3- మీ చదువు స్థాయిని ఎంచుకొని మరోసారి 'అప్లై నౌ' బటన్‌ను నొక్కాలి.

స్టెప్​ 4- మొబైల్ నంబర్ లేదా జీమెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి.

స్టెప్​ 5- దరఖాస్తు ఫారమ్‌ను నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

స్టెప్​ 6- నిబంధనలను అంగీకరించి, మీ అప్లికేషన్‌ను సరిచూసుకుని సబ్మిట్ చేయాలి.

మరిన్ని వివరాలకు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ చూడాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం