సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సీబీఓ పోస్టులకు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 2964 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 మే 9న ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ- 2025 మే 29.
ఎస్బీఐ లో సీబీఓ పోస్ట్ లకు ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో 120 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ ముగిసిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ డిస్క్రిప్టివ్ టెస్ట్ సమాధానాలను కంప్యూటర్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్ష వ్యవధి 2 గంటలు, ఇందులో మొత్తం 120 మార్కులకు 4 సెక్షన్లు ఉంటాయి. ప్రతి విభాగానికి ప్రత్యేక టైమింగ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ వ్యవధి 30 నిమిషాలు. మొత్తం 50 మార్కులకు రెండు ప్రశ్నలతో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే) పరీక్ష ఉంటుంది.
జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి స్క్రీన్ పై అడిగిన సమాచారం అందించడం ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఆన్లైన్ పేమెంట్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఏవైనా ఉంటే అభ్యర్థులు భరించాలి.
సంబంధిత కథనం