ఎస్బీఐ లో సుమారు 3 వేల సీబీఓ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; అర్హత ఏదైనా డిగ్రీ ఉంటే చాలు..-sbi cbo recruitment 2025 apply for around 3 thousand circle based officer posts in sbi direct link here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఎస్బీఐ లో సుమారు 3 వేల సీబీఓ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; అర్హత ఏదైనా డిగ్రీ ఉంటే చాలు..

ఎస్బీఐ లో సుమారు 3 వేల సీబీఓ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; అర్హత ఏదైనా డిగ్రీ ఉంటే చాలు..

Sudarshan V HT Telugu

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2964 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్బీఐ లో సీబీఓ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ (File)

సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సీబీఓ పోస్టులకు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 2964 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 మే 9న ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ- 2025 మే 29.

అర్హతలు

  • ఎస్బీఐ లో సీబీఓ పోస్ట్ లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (ఐడీడీ) చేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన అర్హత. మెడికల్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ వంటి అర్హతలున్న అభ్యర్థులు కూడా అర్హులు.
  • అభ్యర్థుల వయోపరిమితి ఏప్రిల్ 30, 2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి అంటే అభ్యర్థులు 01.05.1995 తరువాత 30.04.2004 లోపు (రెండు రోజులు కలిపి) జన్మించి ఉండాలి.
  • ఏ సర్కిల్ లోని ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు ఆ సర్కిల్ లోని నిర్దేశిత స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం) కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

ఎస్బీఐ లో సీబీఓ పోస్ట్ లకు ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో 120 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ ముగిసిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ డిస్క్రిప్టివ్ టెస్ట్ సమాధానాలను కంప్యూటర్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్ష వ్యవధి 2 గంటలు, ఇందులో మొత్తం 120 మార్కులకు 4 సెక్షన్లు ఉంటాయి. ప్రతి విభాగానికి ప్రత్యేక టైమింగ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ వ్యవధి 30 నిమిషాలు. మొత్తం 50 మార్కులకు రెండు ప్రశ్నలతో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే) పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి స్క్రీన్ పై అడిగిన సమాచారం అందించడం ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఆన్లైన్ పేమెంట్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఏవైనా ఉంటే అభ్యర్థులు భరించాలి.

అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం