QS rankings 2025: సబ్జెక్టుల వారీగా క్యూఎస్ ర్యాంకింగ్స్ 2025; టాప్ 50లో 9 భారతీయ విద్యా సంస్థలు-qs subject wise rankings 2025 9 indian varsities institutes among top 50 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Qs Rankings 2025: సబ్జెక్టుల వారీగా క్యూఎస్ ర్యాంకింగ్స్ 2025; టాప్ 50లో 9 భారతీయ విద్యా సంస్థలు

QS rankings 2025: సబ్జెక్టుల వారీగా క్యూఎస్ ర్యాంకింగ్స్ 2025; టాప్ 50లో 9 భారతీయ విద్యా సంస్థలు

Sudarshan V HT Telugu

QS rankings 2025: 2025 సంవత్సరానికి గానూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో సబ్జెక్టుల వారీగా క్యూఎస్ ర్యాంకింగ్స్ విడుదల అయ్యాయి. ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లో భారత్ నుంచి 9 విద్యా సంస్థలు స్థానం సంపాదించాయి. వాటిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కూడా ఉంది.

క్యూఎస్ ర్యాంకింగ్స్ 2025 (Unsplash)

QS rankings 2025: క్యూఎస్ సబ్జెక్టుల వారీగా ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోని టాప్ 50లో తొమ్మిది భారతీయ విశ్వవిద్యాలయాలు, సంస్థలు స్థానం సంపాదించాయి. కాగా, ఈ ర్యాంకింగ్స్ లో మూడు ఐఐటీలు, రెండు ఐఐఎంలు, జేఎన్యూ సహా కొన్ని టాప్ ఇన్స్టిట్యూషన్లు తమ స్థానాలను కోల్పోయాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 15వ ఎడిషన్ ను బుధవారం ప్రకటించారు.

భారతీయ విద్యా సంస్థలు

ధన్ బాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం) ఇంజనీరింగ్-మినరల్ అండ్ మైనింగ్ లో ప్రపంచ ర్యాంకింగ్స్ లో 20 వ స్థానం సంపాదించింది. ఇంజినీరింగ్-మినరల్ అండ్ మైనింగ్ లో ఐఐటీ బాంబే 28వ స్థానంలో, ఐఐటీ ఖరగ్పూర్ 45 స్థానంలో నిలిచాయి. అయితే, ఈ రెండు సంస్థల ర్యాంకింగ్స్ గత సంవత్సరంతో పోలిస్తే తగ్గాయి. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే వరుసగా 26, 28 స్థానాల్లో నిలిచాయి. గత సంవత్సరం ర్యాంకింగ్స్ లో ఈ రెండు విద్యా సంస్థలు సంయుక్తంగా 45వ స్థానంలో ఉన్నాయి. అలాగే, ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో కూడా ఈ రెండు సంస్థలు తమ ర్యాంకును మెరుగుపరుచుకుని టాప్ 50 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

టాప్ లో ఐఐఎం ఏ

బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు లు టాప్ 50 లో ఈ సంవత్సరం కూడా స్థానం సంపాదించాయి. అయితే వాటి ర్యాంకింగ్ గత సంవత్సరంతో పోలిస్తే పడిపోయాయి. ఐఐఎం అహ్మదాబాద్ ర్యాంకింగ్ 22 నుంచి 27కు పడిపోగా, ఐఐఎం బెంగళూరు ర్యాంకింగ్ 32 నుంచి 40కి పడిపోయింది. ఐఐటీ మద్రాస్ (పెట్రోలియం ఇంజినీరింగ్), జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (డెవలప్మెంట్ స్టడీస్) ప్రపంచంలోని టాప్ 50లో కొనసాగుతున్నాయి.

మొత్తం 79 భారతీయ విశ్వవిద్యాలయాలు

మొత్తం 79 భారతీయ విశ్వవిద్యాలయాలు ఈ సంవత్సరం క్యూఎస్ ర్యాంకింగ్స్ లో స్థానం సంపాదించాయి. ఇవి గత సంవత్సరంతో పోలిస్తే 10 ఎక్కువ. క్యూఎస్ సబ్జెక్ట్-స్పెసిఫిక్ ర్యాంకింగ్స్ యొక్క తాజా ఎడిషన్ లో చైనా, యుఎస్, యుకె, కొరియా తరువాత భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. మొత్తం ఎంట్రీల సంఖ్యలో 12 వ స్థానంలో ఉంది. పరిమాణం, నాణ్యత పరంగా దేశంలో పెరుగుతున్న ఉన్నత విద్యా పర్యావరణ వ్యవస్థ ధోరణికి కొనసాగింపుగా ఈ ర్యాంకింగ్స్ లో కొత్త ఎంట్రీలు ఎక్కువగా ఉన్నాయని క్యూఎస్ తెలిపింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం