ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 1,620 ఉన్నాయి. ఇందుకు వేర్వురు ప్రకటనలు విడుదల కాగా… ఇందులో పదో తరగతి అర్హతతోనే ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ప్రాసెస్ సర్వర్ ఖాళీలను కేవలం పదో తరగతి అర్హతతోనే రిక్రూట్ చేయనున్నారు. అన్ని జిల్లా కోర్టుల్లో కలిపి మొత్తం 164 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో ఉత్తీర్ణత లేదా అందుకు సమానమైన పరీక్షలో పాసై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు స్థానిక భాష అయిన తెలుగు వచ్చి ఉండాలి. అనంతపురం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్లకు తమిళం వచ్చి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులకు తెలుగుతో పాటు ఒడిశా భాషా తెలిసి ఉండాలి.
2025 జులై 1వ తేదీ నాటికి 18 - 42 ఏళ్లు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాల్డెజ్ కి 40, జనరల్ ఇంగ్లీష్ 10, మెంటల్ ఎబిలీటికి 30 మార్కులు ఉంటాయి. సమయం 90 నిమిషాలు కేటాయిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియంలోనూ ఇస్తారు.
రాత పరీక్షలో ఈడబ్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఇక బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.
ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు సంబంధించి మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమతాయి. జూన్ 2వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. దరఖాస్తు చేసుకునే ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 400 ఫీజు చెల్లించాలి.
ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలనుకునే వాళ్లు https://aphc.gov.in/recruitments.php వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. హాల్ టికెట్లతో పాటు రాత పరీక్ష తేదీలను కూడా ఇక్కడే తెలుసుకోవచ్చు. ఈ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు https://aphc.gov.in/docs/06052025-9.pdf లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు. లేదా ఏపీ హైకోర్టు వెబ్ సైట్ లోకి వెళ్లి రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి నోటిఫికేషషన్ వివరాలను తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం