ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థులు చదువుకు దూరంకాకూడదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా వారికి స్కాలర్షిప్స్ ఇస్తోంది. వాటిల్లో ఒకటి.. పీఎం ఉచ్చతార్ శిక్షా ప్రోత్సాహన్. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కనేప్పటికీ ఆర్థిక ఇబ్బందులుతో తమ ఆశయాలను నెరవేర్చుకోవడంలో విఫలమయ్యే విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కళాశాలలు, విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం ప్రధాన మంత్రి ఉచ్ఛతార్ శిక్షా ప్రోత్సాహన్ (పీఎం-యూఎస్పీ) సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యా విభాగానికి చెందిన పథకం.
పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువులు చదివేటప్పుడు వారి రోజువారీ ఖర్చులలో కొంత భాగాన్ని భరించడానికి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం.
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాదికి గరిష్టంగా 82,000 కొత్త స్కాలర్షిప్స్ అందిస్తారు.
ఈ స్కాలర్షిప్ స్కీమ్ని పరిగణనలోకి తీసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి..
ఈ విద్యార్థులు స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఈ పత్రాలను సమర్పించాలి.
మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్సైట్ని సందర్శించండి.
సంబంధిత కథనం