Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Scholarship: పేద విద్యార్థులు తాము కూడా ఉన్నత విద్య చదవాలన్న కలలను సాకారం చేయడానికి ఈ ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ స్కాలర్ షిప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనం అందించి, వారు ఉన్నత విద్యను అభ్యసించే సమయంలో వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు.
కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ (PM USP) అనే సెంట్రల్ సెక్టార్ స్కాలర్ షిప్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువులు చదివేటప్పుడు వారి రోజువారీ ఖర్చులలో కొంత భాగాన్ని భరించడానికి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి గరిష్టంగా 82,000 స్కాలర్ షిప్ (scholarships) అందిస్తారు.
ఈ స్కాలర్ షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఈ క్రింది అర్హత ప్రమాణాలలో ఉత్తీర్ణత సాధించాలి. అవి..
ఈ క్రింది విద్యార్థులు స్కాలర్ షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
స్కాలర్ షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఈ క్రింది పత్రాలను సమర్పించాలి.
ఈ స్కాలర్ షిప్ (student scholarships) గురించి మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.