PM Modi: ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చా’ లో పాల్గొనాలని అనుకుంటున్నారా? ఇలా రిజిస్టర్ చేసుకోండి-pm modis pariksha pe charcha where and how to register last date and more ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Pm Modi: ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చా’ లో పాల్గొనాలని అనుకుంటున్నారా? ఇలా రిజిస్టర్ చేసుకోండి

PM Modi: ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చా’ లో పాల్గొనాలని అనుకుంటున్నారా? ఇలా రిజిస్టర్ చేసుకోండి

Sudarshan V HT Telugu
Jan 02, 2025 04:00 PM IST

Pariksha Pe Charcha: ప్రతీ సంవత్సరం పరీక్షల ఒత్తిడిని విద్యార్థులు అధిగమించడానికి ప్రధాని మోదీ వారితో పరీక్షా పే చర్చా పేరుతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి జనవరి 14 వరకు అవకాశం ఉంది.

 ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చా’
ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చా’

PM Modi's Pariksha Pe Charcha: ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ (పీపీసీ) ఎనిమిదో ఎడిషన్ జనవరిలో జరుగుతుందని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 19న ప్రారంభమయ్యాయని తెలిపారు. పీపీసీ 2025 కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు జనవరి 14 వరకు అధికారిక వెబ్ సైట్ MyGov.in ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

yearly horoscope entry point

జనవరి 12 నుంచి..

ఈ సంవత్సరం 2025 జనవరి 12 (జాతీయ యువజన దినోత్సవం) నుంచి 2025 జనవరి 23 (నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి) వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పీపీసీ 2025 కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పటికే MyGov.in నుండి ప్రారంభమయ్యాయని, జనవరి 14 వరకు తెరిచి ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

'ఒత్తిడిని తగ్గించడం, విద్యార్థులను ప్రోత్సహించడం లక్ష్యం'

బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) పాల్గొనే వార్షిక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ‘పరీక్షా పే చర్చా’లో ప్రశ్నా-సమాధానం సెషన్ ఉంటుంది, ఇందులో పరీక్షల ఒత్తిడి, ఇతర సమస్యలకు సంబంధించిన విషయాలను చర్చిస్తారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు జీవితాన్ని 'ఉత్సవ్'గా జరుపుకునేలా ప్రోత్సహించడానికి ఈ పీపీసీ ని ప్రారంభించారు. ఇది గత ఏడేళ్లుగా అద్భుతమైన విజయాన్ని సాధించిందని విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. స్వదేశీ గేమ్ సెషన్లు, మారథాన్ రన్లు, మీమ్ పోటీలు, నుక్కడ్-నాటకాలు, యోగా-కమ్-మెడిటేషన్ సెషన్లు; సీబీఎస్ఈ, కేవీఎస్, ఎన్వీఎస్ ల గాన ప్రదర్శనలు, పోస్టర్ తయారీ పోటీలు, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, ప్రత్యేక అతిథులతో వర్క్ షాప్ లు, స్ఫూర్తిదాయకమైన సినిమా సిరీస్ ల ప్రదర్శనలు ఇందులో ఉంటాయి.

ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

పరీక్షా పే చర్చా (PPC) లో పాల్గొనాలనుకునే వారు ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాలి.

  • ముందుగా అధికారిక వెబ్సైట్ https://innovateindia1.mygov.in/ ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో ‘పార్టిసిపేట్ నౌ’ లింక్ మీద క్లిక్ చేయండి.
  • విద్యార్థి (స్వీయ భాగస్వామ్యం), విద్యార్థి (టీచర్ లాగిన్ ద్వారా పాల్గొనడం), టీచర్, పేరెంట్ కేటగిరీల్లో మీ కేటగిరీని ఎంచుకోండి. దాని క్రింద పార్టిసిపేట్ పై క్లిక్ చేయండి.
  • మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు/ ఇమెయిల్ ఐడిని నమోదు చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన ఇతర వివరాలను నింపండి.

పార్టిసిపెంట్స్ అండ్ ఈవెంట్స్ వివరాలు

అధికారిక వెబ్ సైట్ ప్రకారం 2024 డిసెంబర్ 30 ఉదయం 10 గంటల వరకు 76.37 లక్షల మంది విద్యార్థులు పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. 6.65 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.12 లక్షల మంది తల్లిదండ్రులు పీపీసీ 2025 కోసం రిజిస్టర్ చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 16న తల్కతోరా స్టేడియంలో పాఠశాల, కళాశాల విద్యార్థులతో తొలి ఎడిషన్ జరిగింది. ప్రగతి మైదాన్ లోని భరత్ మండపంలో టౌన్ హాల్ ఫార్మాట్ లో జరిగిన ఈ ఏడో ఎడిషన్ లో విదేశాల నుంచి ఆన్ లైన్ లో పాల్గొన్నారు.

Whats_app_banner