ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగిసింది. దీంతో పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా… పరీక్షల తేదీలతో పాటు షెడ్యూల్ వివరాలను ప్రకటించారు.
ఓయూ పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 27వ తేదీతో అన్ని సబ్జెక్టుల ఎగ్జామ్స్ ముగుస్తాయని తేజా ప్రకటనలో పేర్కొన్నారు. ఎంట్రెన్స్ టెస్ట్ కోసం కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు.
ప్రతిరోజూ మూడు సెషన్లు ఉంటాయి. ఉదయం సెషన్ 09.30 AM నుంచి 11.00 గంటల మధ్య ఉంటుంది. ఇక రెండో సెషన్ 12.30 PM to 02.00 గంటల వరకు, మూడో సెషన్ 03.30 PM to 05.00 గంటల మధ్య నిర్వహిస్తారు. లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్ పరీక్ష ఇంగ్లీష్ భాషలోనే నిర్వహిస్తారు.
అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లతో పాటు మరిన్ని వివరాల కోసం www.osmania.ac.in లేదా www.ouadmissions వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఒరియంటల్ లాంగ్వేజేస్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్ మెంట్, ఎడ్యుకేషన్, లా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మెటిక్స్ డిపార్ట్ మెంట్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా డిపార్ట్ మెంట్లలో ఉండే కోర్సుల వివరాలను వెబ్ సైట్ లో ఉంచారు.
ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ పరీక్ష సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. సబ్జెక్టుల వారీగా పీడీఎఫ్ కాపీలను విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం