జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల; ఫలితాల విడుదల రేపు-nta announces jee main session 2 result final answer key release dates ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల; ఫలితాల విడుదల రేపు

జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల; ఫలితాల విడుదల రేపు

Sudarshan V HT Telugu

జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ ని ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫైనల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 17న అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి, మళ్లీ కాసేపటికే ఎన్టీఏ తొలగించిన విషయం తెలిసిందే. కాగా, జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాల ఏప్రిల్ 19న విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీని జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో ఏప్రిల్ 18, శుక్రవారం మధ్యాహ్నం ఎన్టీఏ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాలను రేపు ఏప్రిల్ 19న జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో విడుదల చేస్తామని తెలిపింది.

ఫైనల్ ఆన్సర్ కీ

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీని జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో ఎన్టీఏ విడుదల చేసింది. ‘‘జేఈఈ మెయిన్స్ 2025 సెషన్-2 ఫైనల్ ఆన్సర్ కీని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత అంటే 2025 ఏప్రిల్ 18న మధ్యాహ్నం 2 గంటల తరువాత జేఈఈ మెయిన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలను 19.4.2025న విడుదల చేయనున్నాము. ఇది అభ్యర్థులందరికీ సమాచారం కోసం’’ అని ఎన్టీఏ ఎక్స్ పోస్ట్ లో తెలిపింది. అయితే, జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 తుది ఆన్సర్ కీని ఏప్రిల్ 17న అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి, మళ్లీ కాసేపటికే ఎన్టీఏ తొలగించింది.

ఏప్రిల్ 2 నుంచి పరీక్షలు

ఐఐఐటీలు, ఎన్ ఐటీలు, ఇతర సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరిగింది. తొలుత జేఈఈ మెయిన్ పేపర్ 1 (బీఈ/బీటెక్) ఫలితాలను ఎన్టీఏ విడుదల చేయనుంది. పేపర్-2 (బీఆర్క్/బీప్లానింగ్)కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఇంకా విడుదల కాలేదు. పేపర్-2కు సంబంధించిన ప్రొవిజనల్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలను ఆహ్వానించి, వాటిని సమీక్షించి తుది కీని సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత పేపర్-2 ఫలితాలను ప్రకటిస్తారు.

నిన్న రిలీజ్ చేసి..

జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పేపర్-1 తుది ఆన్సర్ కీని గురువారం విడుదల చేయగా, కొన్ని గంటల తర్వాత ఎన్టీఏ దాన్ని వెబ్సైట్ నుంచి తొలగించింది. ఇప్పుడు దాని విడుదలకు సవరించిన తేదీని ప్రకటించింది. జేఈఈ మెయిన్స్ ఫలితాలను వీక్షించడానికి అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్లు, పుట్టిన తేదీలను ఉపయోగించాలి.

జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి

జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాలను విడుదల చేసిన తరువాత, ఈ కింది స్టెప్స్ ను ఉపయోగించి తమ రిజల్ట్స్ ను విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.

  • ముందుగా ఎన్టీఏ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.
  • సెషన్ 2 స్కోర్ కార్డ్ లింక్ పై క్లిక్ చేయండి.
  • లాగిన్ విండో కనిపిస్తుంది. అవసరమైన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
  • స్కోర్ కార్డ్ చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోండి.

ఏఐఆర్ లు కూడా..

సెషన్ 2 ఫలితాలతో పాటు, ఎన్టీఏ ఆల్ ఇండియా ర్యాంకులను పంచుకుంటుంది. పరీక్షలో రెండు సెషన్లు రాసిన వారికి రెండు స్కోర్లలో అత్యుత్తమ స్కోరును ర్యాంకింగ్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల సంఖ్య, 100 పర్సంటైల్ స్కోరర్ల (టాపర్స్) పేర్లను కూడా ఏజెన్సీ పంచుకుంటుంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం