ఏపీ సీఐడీలో హోంగార్డుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల.. విద్యార్హతలు, దరఖాస్తు వివరాలు…-notification released for the recruitment of home guards in ap cid ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ సీఐడీలో హోంగార్డుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల.. విద్యార్హతలు, దరఖాస్తు వివరాలు…

ఏపీ సీఐడీలో హోంగార్డుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల.. విద్యార్హతలు, దరఖాస్తు వివరాలు…

Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ సిఐడీ విభాగంలో టెక్నికల్‌ హోమ్ గార్డుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. సాంకేతిక విద్యార్హతలు కలిగి ఉండి, కంప్యూటర్‌పై పని చేసే పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఏపీ సీఐడీలో హోంగార్డు ఉద్యోగాలు...

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగంలో 28 హోంగార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 1 నుంచి 15 లోగా దర ఖాస్తు చేసుకోవాలని ఏపీ సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ సూచించారు.

ఏపీ సీఐడీలో హోంగార్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ‌్యర్థులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీసు హెడ్ క్వార్టర్స్, మంగళగిరి-522503 చిరునామాకు తమ దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

అభ్యర్థులు నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టులో దరఖాస్తులను సమర్పించ వచ్చని డీజీ రవిశంకర్‌ సూచించారు. పూర్తి వివరాల కోసం 94407 00860 నంబర్‌లో సంప్రదించాలని ఓ ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు…

హోంగార్డు పోస్టులకు దరఖాస్తు చేసిన వారు ఏపీకి చెందిన వారై ఉండాలి.

వయోపరిమితి: 18-50 ఏళ్ల మధ్య ఉండాలి. 2025 మే 1 నాటికి కనీస వయసు ఉండాలి ఉండాలి.

పురుషులు 160 సెం.మీ ఎత్తు, మహిళలు 150 సెం.మీ ఉండాలి. ఎస్టీ మహిళా అభ్యర్థులకు 5 సెం.మీ. మినహాయింపు ఉంటుంది. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి.

బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. కంప్యూటర్‌పై పనిచేసే నైపుణ్యాలు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.

విద్యార్హతల పరిశీలనతో పాటు డ్రైవింగ్ నైపుణ్యాలపై పరీక్ష ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు రోజుకు రూ.710 చొప్పున డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారు. శారీరక కొలతల పరీక్ష, కంప్యూటర్, టైపింగ్ పరిజ్ఞానం పరిశీలిస్తారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.