ఐడీబీఐలో ఉద్యోగాలు… 676 జూనియర్ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల-notification released for the recruitment of 676 junior assistant manager posts in idbi ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఐడీబీఐలో ఉద్యోగాలు… 676 జూనియర్ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఐడీబీఐలో ఉద్యోగాలు… 676 జూనియర్ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Sarath Chandra.B HT Telugu

ఐడీబీఐ బ్యాంకులో దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీలలో జూనియర్ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌ల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం 676 ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ఐడీబీఐ బ్యాంకులో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 676 పోస్టులను తాజా నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఐబీపీఎస్ ఆధ్వర్యంలో జరిగే సీబీటీ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.

ఐడిబిఐలో భర్తీ చేసే జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాల్లో 271 అన్‌ రిజర్వ్‌డ్‌ పోస్టులు కాగా 140 ఎస్సీలకు, 74 ఎస్టీలకు, 124 ఓబీసీలకు, 67 ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు 31 పోస్టులను రిజర్వ్‌ చేశారు.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 2025 మే1 వతేదీ నాటికి నిర్దేశిత వయసు కలిగి ఉండాలి. మే 7న ఉద్యోగ ప్రకటన వెలువడింది. మే 8-20వ తేదీల మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మే 8 గురువారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదు, ఎడిట్‌, ఫీజుల చెల్లింపు అనుమతిస్తారు. మే 20వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది.

దరఖాస్తుదారులు మే 1 నాటికి కనీసం 20ఏళ్ల వయసు కలిగి ఉండాలి. కనీసం 60శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 55శాతం మార్కులతో డిగ్రీ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా విద్యార్థులు దరఖాస్తు చేయకూడదు.

ఆకర్షణీయమైన వేతనాలు…

అభ్యర్థులకు తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన అభ‌్యర్థులకు రూ.40-45వేల ప్రారంభ వేతనం లబిస్తుంది. క్లాస్‌ ఏ సిటీలో పోస్టింగ్‌ లభించిన వారికి వార్షిక వేతనం రూ.6.14లక్షల నుంచి రూ.6.50లక్షల వరకు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్‌ సిబిటి ద్వారా జరుగుతుంది. డాక్యుమెంట్‌వెరిఫికేషన్‌, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ రిక్రూట్‌మెంట్‌ మెడికల్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.

పరీక్ష నిర్వహణ ఇలా...

కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షల్లో లాజికల్ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌ 60మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్కులకు, క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్ 40 మార్కులకు, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్‌ 60 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కట్‌ఆఫ్‌ మార్కులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వ రిజర్వేషన్లకు అనుగుణంగా సడలింపు ఇస్తారు.

పరీక్షా కేంద్రాలు....

ఏపీలో ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.

ఐడిబిఐ జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ లింకు అనుసరించండి.

ఐడిబిఐలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ కోసం ఈ లింకును అనుసరించండి…

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం