మహిళలకు గుడ్ న్యూస్ - ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్, జూలై 5 లాస్ట్ డేట్-notification issued for 30 asha worker posts in east godavari district ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  మహిళలకు గుడ్ న్యూస్ - ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్, జూలై 5 లాస్ట్ డేట్

మహిళలకు గుడ్ న్యూస్ - ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్, జూలై 5 లాస్ట్ డేట్

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు జులై 5వ తేదీ వరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆశా ఉద్యోగాలు

తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు వివరాలను ప్రకటించారు.

నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం…. అనపర్తి–3, బిక్కవోలు-1, రంగంపేట-2, రాజమహేంద్రవరం రూరల్-4, కడియం–3, రాజానగరం-2, కోరుకొండ-2, సీతానగరంం 2, గోకవరం–1, దేవరపల్లి-3, నల్లజర్ల–2, తాళ్ళపూడి –1, కొవ్వూరు రూరల్-1, చాగల్లు–1, పెరవలి-1, ఉండ్రాజవరంలో 1 పోస్టు ఉంది.

జూలై 5 గడువు…

ఈ పోస్టుల భర్తీకి ఈ నెల 28 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వాళ్లు… జూలై 5 వరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు.

ముఖ్య వివరాలు…

  • నోటిఫికేషన్ విడుదల - 28-06-2025
  • దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - 05-07-2025
  • ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ - 17-07-2025
  • అభ్యంతరాల స్వీకరణ - 21-07-2025
  • ఫైనల్ మెరిట్ లిస్ట్ - 24-07-2025
  • ఫలితాలు విడుదల - 26-07-2025

ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి. https://eastgodavari.ap.gov.in వెబ్ సైట్ నుంచి ఈ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వివరాలను నమోదు చేసి… విద్యార్హత పత్రాలతో పాటు ఆధార్ లేదా రేషన్ కార్డు, కుల,ఆదాయ ధ్రువీకరణకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను జత చేయాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు స్థానికులై ఉండాలి. కనీసం పదో తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.