NEET UG 2025: నీట్ యూజీ 2025 పరీక్ష ప్రశ్నాపత్రం సరళి, పరీక్ష వ్యవధిపై స్పష్టతకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నీట్ యూజీ 2025 ప్రశ్నాపత్రం సరళి, పరీక్ష వ్యవధిని ప్రీ కోవిడ్ ఫార్మాట్ కు మారుస్తామని ఎన్టీఏ అభ్యర్థులకు తెలియజేసింది. ప్రీ కోవిడ్ ఫార్మాట్ ప్రకారం ఇకపై సెక్షన్ బి ఉండదు.
నీట్ (NEET) యూజీ 2025 రిజిస్ట్రేషన్లకు ఏపీఏఆర్ ఐడీ తప్పనిసరి కాదని, నీట్ (యూజీ)-2025ను పెన్ అండ్ పేపర్ మోడ్ (ఓఎంఆర్ ఆధారిత)లో సింగిల్ డే, సింగిల్ షిఫ్టులో నిర్వహిస్తామని ఎన్టీఏ ఇప్పటికే అభ్యర్థులకు తెలిపింది.