నీట్​ పీజీ అభ్యర్థులకు అలర్ట్​- నేడు సిటీ రీ సబ్మిషన్​ విండో ఓపెన్​..-neet pg 2025 exam city resubmission window to open today check full details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  నీట్​ పీజీ అభ్యర్థులకు అలర్ట్​- నేడు సిటీ రీ సబ్మిషన్​ విండో ఓపెన్​..

నీట్​ పీజీ అభ్యర్థులకు అలర్ట్​- నేడు సిటీ రీ సబ్మిషన్​ విండో ఓపెన్​..

Sharath Chitturi HT Telugu

నీట్ పీజీ 2025 పరీక్ష రీ సబ్మిషన్ విండో జున్ 13, 2025న ప్రారంభమైంది. పరీక్ష నగర వివరాలను నింపే స్టెప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

నీట్​ పీజీ అభ్యర్థులకు అలర్ట్​!

నీట్ పీజీ 2025 పరీక్ష సిటీ రీ- సబ్మిషన్ విండోను జూన్ 13, 2025న ఓపెన్​ చేయనుంది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్). పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్​కి హాజరు కావాలనుకునే అభ్యర్థులు natboard.edu.in వద్ద ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్​లో లింక్​ని పొందొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు లింక్ యాక్టివేట్ అవుతుంది.

నీట్​ పీజీ 2025 రీ సబ్మిషన్​ విండో..

నీట్​ పీజీ 2025 ఎగ్జామ్​ సీటీని ఎంచుకునేందుకు చివరి తేదీ జూన్ 17, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్​లైన్​ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు, అభ్యర్థులు టెస్టింగ్ సీట్లు అందుబాటులో ఉన్న నగరాలను మాత్రమే చూడగలరు. ఎంచుకున్న ఎగ్జామ్ సిటీలో వేదిక కేటాయింపు ఎన్బీఈఎంఎస్ ద్వారా జరుగుతుంది. అడ్మిట్ కార్డుల ద్వారా కచ్చితమైన పరీక్ష కేంద్రాన్ని అభ్యర్థులకు తెలియజేస్తారు.

ప్రయాణం/బోర్డింగ్ మొదలైన వాటి కోసం అభ్యర్థులు తమ సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అభ్యర్థులు ఎగ్జామ్ సిటీని ఎంపిక చేస్తారు. ఎడిట్ విండో జూన్ 20న ప్రారంభమై జూన్ 22, 2025న ముగుస్తుంది. పరీక్ష తేదీ వివరాలను 2025 జులై 21న అభ్యర్థులకు తెలియజేస్తారు. అడ్మిట్ కార్డును 2025 జులై 31న, పరీక్షను ఆగస్టు 3, 2025న నిర్వహిస్తారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్​లో జరుగుతుంది.

నీట్​ పీజీ 2025 ఫలితాలను సెప్టెంబర్ 3న ప్రకటిస్తారు.

నీట్ పీజీ 2025: ఎగ్జామ్ సిటీ వివరాలను ఎలా నింపాలి?

పరీక్ష సిటీ వివరాలను తిరిగి సబ్మిట్ చేయడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్​ని అనుసరించవచ్చు.

1. natboard.edu.in ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న నీట్ పీజీ 2025 ఎగ్జామ్ సిటీ రీ సబ్మిషన్ విండో లింక్​పై క్లిక్ చేయండి.

3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. ఇప్పుడు పరీక్ష నగరం, ఇతర వివరాలను ఎంచుకోండి.

5. సబ్మిట్​పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్​లోడ్​ చేసుకోవాలి.

6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.

మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్​ని ఎంచుకోండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం