నీట్ పీజీ 2025 పరీక్ష సిటీ రీ- సబ్మిషన్ విండోను జూన్ 13, 2025న ఓపెన్ చేయనుంది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్). పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్కి హాజరు కావాలనుకునే అభ్యర్థులు natboard.edu.in వద్ద ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్లో లింక్ని పొందొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు లింక్ యాక్టివేట్ అవుతుంది.
నీట్ పీజీ 2025 ఎగ్జామ్ సీటీని ఎంచుకునేందుకు చివరి తేదీ జూన్ 17, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు, అభ్యర్థులు టెస్టింగ్ సీట్లు అందుబాటులో ఉన్న నగరాలను మాత్రమే చూడగలరు. ఎంచుకున్న ఎగ్జామ్ సిటీలో వేదిక కేటాయింపు ఎన్బీఈఎంఎస్ ద్వారా జరుగుతుంది. అడ్మిట్ కార్డుల ద్వారా కచ్చితమైన పరీక్ష కేంద్రాన్ని అభ్యర్థులకు తెలియజేస్తారు.
ప్రయాణం/బోర్డింగ్ మొదలైన వాటి కోసం అభ్యర్థులు తమ సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అభ్యర్థులు ఎగ్జామ్ సిటీని ఎంపిక చేస్తారు. ఎడిట్ విండో జూన్ 20న ప్రారంభమై జూన్ 22, 2025న ముగుస్తుంది. పరీక్ష తేదీ వివరాలను 2025 జులై 21న అభ్యర్థులకు తెలియజేస్తారు. అడ్మిట్ కార్డును 2025 జులై 31న, పరీక్షను ఆగస్టు 3, 2025న నిర్వహిస్తారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్లో జరుగుతుంది.
నీట్ పీజీ 2025 ఫలితాలను సెప్టెంబర్ 3న ప్రకటిస్తారు.
పరీక్ష సిటీ వివరాలను తిరిగి సబ్మిట్ చేయడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ని అనుసరించవచ్చు.
1. natboard.edu.in ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్ని సందర్శించండి.
2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న నీట్ పీజీ 2025 ఎగ్జామ్ సిటీ రీ సబ్మిషన్ విండో లింక్పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. ఇప్పుడు పరీక్ష నగరం, ఇతర వివరాలను ఎంచుకోండి.
5. సబ్మిట్పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.
మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్ని ఎంచుకోండి.
సంబంధిత కథనం