ఢిల్లీకి చెందిన ఓ టెక్కీ తన భారీ వేతన పెంపును వెల్లడించి ఇంటర్నెట్ ను ఆశ్చర్యపరిచాడు. తన ప్రస్తుత ప్యాకేజీ అయిన రూ. 5.5 ఎల్పీఏ నుంచి ఒక్కసారిగా రూ .45 లక్షల (ఎల్పిఎ) ప్యాకేజీతో జాబ్ ఆఫర్ను పొందగలిగానని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ లో అతడు పేర్కొన్నాడు.
ఢిల్లీకి చెందిన టెక్కీ దేవేష్ తన సాలరీ ప్యాకేజీలో చోటు చేసుకున్న భారీ పెంపు గురించి ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. తనలాంటి మధ్యతరగతి వ్యక్తికి ఈ స్థాయిలో వేతనం పెరగడం ఇప్పటికీ కలగానే అనిపిస్తోందని అన్నారు. ‘‘ఎప్పుడూ చెప్పలేదు, కానీ నిజాయితీగా చెప్పాలంటే, నేను ఇప్పటికీ కలలో ఉన్నానని కొన్నిసార్లు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత సంవత్సరమే ఐబీఎం లో నా పూర్తికాల వృత్తిని కేవలం రూ. 5.5 లక్షల వార్షిక వేతనంతో ప్రారంభించాను. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే నా చేతిలో రూ. 45 ఎల్ పీఏ సిటిసి ఆఫర్ ఉంది. నాలాంటి మధ్యతరగతి కుర్రాడికి ఇది ఇప్పటికీ కలగానే అనిపిస్తుంది’’ అని దేవేష్ ఎక్స్ లో రాశారు.
దేవేశ్ పేర్కొన్న భారీ శాలరీ జంప్ చాలా మందిని ఆకట్టుకుంది. వారు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా దేవేష్ ను చిట్కాలు మరియు సలహాలు అడిగారు. ‘‘1 సంవత్సరం వ్యవధిలో అది ఎలా అనిపిస్తుంది?" అని ఒక వ్యక్తి ప్రశ్నించగా, "నన్ను చూసి గర్వపడుతున్నాను" అని దేవేశ్ సమాధానమిచ్చాడు. ‘‘ఏడాదిలో 45 ఎల్పీఏ ఆఫర్? ఇది నమ్మశక్యంగా లేదు. మీరు కొన్ని చిట్కాలను పంచుకోగలరా?" అని మరొకరు అడిగారు.
చాలా భారతీయ కంపెనీలు అభ్యర్థి మునుపటి సీటీసీ ఆధారంగా వేతనాలు ఆఫర్ చేస్తున్నందున ఈ పోస్ట్ అతని వాదనల ప్రామాణికతపై సందేహాలను రేకెత్తించింది. చాలా సందర్భాల్లో, కొత్త ఆఫర్ అభ్యర్థి మునుపటి సీటీసీ పై 30% కన్నా మించదు. ఇదే అనుమానాన్ని పలువురు యూజర్లు లేవనెత్తారు. దీనికి దేవేశ్ సమాధానమిస్తూ, పెద్ద పెద్ద టెక్ కంపెనీలకు ఇప్పటికే ఒక్కో ఉద్యోగానికి ఒక్కో వేతన పరిధి ఉంటుందని, అందువల్ల, ఆ రోల్ కోసం అభ్యర్థిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మునుపటి జీతం అంత ముఖ్యం కాదని దేవేష్ వివరించారు. ‘‘కంపెనీలకు వారి బేస్ పే, సీటీసీ ప్రీసెట్ అయి ఉంటాయి. కాబట్టి ఇది అందరికీ సమానంగా ఉంటుంది, వారు మీ మునుపటి వేతనాలపై మిమ్మల్ని జడ్జ్ చేయరు" అని ఆయన ఎక్స్ లో రాశారు.
సంబంధిత కథనం