ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకో శుభవార్త వచ్చేసింది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ లో జాబ్ మేళాను నిర్వహించనున్నారు. అర్హులైన వారు జనవరి 28వ తేదీన వారి సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగ మేళాలో మొత్తం 125 పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఇందులో మెకానిక్ ఉద్యోగాలు 25 ఉండగా, సర్వీస్ అడ్వజైర్స్ ఖాళీలు 50 ఉన్నాయి. రిలేషన్ షిప్ మేనేజర్ ఖాళీలు కూడా మరో 50 ఉన్నాయి. మెకానిక్ ఉద్యోగాలకు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సర్వీస్ అడ్వజైర్స్ కు బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్, రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎంపికైన వారికి రూ. 11 వేల నుంచి 20 వేల వరకు జీతం చెల్లిస్తారు. వీరంతా కూడా హైదరాబాద్ వేదికగా పని చేయాల్సి ఉంటుంది.
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్లో మిత్రా ఏజెన్సీస్ (మారుతీ సుజుకీ) ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ మేళా ఉంటుంది. దరఖాస్తుదారులు 18 నుంచి 35 సంవత్సరాల లోపు గల వారు ఉండాలి. ఈ మేళాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 7799884909ను సంప్రదించవచ్చు.
వరంగల్ నిట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్ చేయనున్నారు.ఎంపికైన వారు ఏడాది కాలం పాటు పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. https://nitw.ac.in/staffrecruit లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం