JEE Mains Result 2025 : జేఈఈ మెయిన్స్​లో ఇద్దరు అభ్యర్థులకు ఒకటే స్కోర్​ వస్తే ఏమవుతుంది?-jee mains result 2025 news how will nta resolve ties between candidates ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Jee Mains Result 2025 : జేఈఈ మెయిన్స్​లో ఇద్దరు అభ్యర్థులకు ఒకటే స్కోర్​ వస్తే ఏమవుతుంది?

JEE Mains Result 2025 : జేఈఈ మెయిన్స్​లో ఇద్దరు అభ్యర్థులకు ఒకటే స్కోర్​ వస్తే ఏమవుతుంది?

Sharath Chitturi HT Telugu

JEE Mains Result : జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. అయితే, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకటే స్కోర్​ వస్తే ఏమవుతుంది? ర్యాంక్​ని ఎలా కేటాయిస్తారు? పూర్తి వివరాలు..

జేఈఈ మెయిన్స్​ 2025 స్కోర్​ టై అయితే ఏమవుతుంది? (Unsplash)

జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్​ 2 ప్రొవిజినల్​ ఆన్సర్​ కీని ఇటీవలే విడుదల చేసింది నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఏన్టీఏ). సెషన్ 2 ఫలితాలతో పాటు అభ్యర్థుల ఆల్​ ఇండియా ర్యాంకులను ఎన్టీఏ త్వరలోనే ప్రకటించనుంది. అయితే, ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం వల్ల ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకటే మార్కులు (ఎన్టీఏ స్కోర్లు) పొందే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితులను ఎన్టీఏ ఎలా పరిష్కరిస్తుంది? అంటే.. ఇందుకోసం ఒక విధానం ఉంది.

జేఈఈ మెయిన్స్​ ఫలితాల్లో టై సమస్యలు ఇలా పరిష్కారమవుతాయి..

పేపర్​ 1 (బీఈ/బీటెక్)కు..

గణితంలో స్కోరు చూస్తారు

ఆ తర్వాత ఫిజిక్స్​ స్కోరు చూస్తారు

ఆ తర్వాత కెమిస్ట్రీలో స్కోరు చూస్తారు

పరీక్షలోని అన్ని సబ్జెక్టుల్లో తక్కువ నిష్పత్తిలో తప్పు సమాధానాలు, సరైన సమాధానాలు సాధించిన అభ్యర్థులను చూస్తారు

ఆ తర్వాత జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్​ 2లో గణితంలో సరైన సమాధానాలు, తక్కువ నిష్పత్తిలో తప్పు సమాధానాలు చూస్తారు

ఆ తర్వాత ఫిజిక్స్​లో తక్కువ నిష్పత్తిలో తప్పుడు సమాధానాలు, సరైన సమాధానాలు చూస్తారు,

ఆ తర్వాత కెమిస్ట్రీకి కూడా ఈ విధంగానే చూస్తారు.

ఇంత చూసిన తర్వాత కూడా ఒకవేళ టై ఉంటే అభ్యర్థులకు ఒకటే ర్యాంకు కేటాయిస్తారు.

పేపర్ 2ఏ (బీఆర్క్)

మ్యాథ్స్​ స్కోరా

ఆ తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్​లో స్కోరు

ఆ తర్వాత డ్రాయింగ్ టెస్ట్​లో స్కోరు

జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్​ 2 అన్ని సబ్జెక్టుల్లో తక్కువ నిష్పత్తిలో తప్పు సమాధానాలు, సరైన సమాధానాలు చూస్తారు

గణితంలో (పార్ట్ -1) తక్కువ నిష్పత్తిలో తప్పు సమాధానాలు, సరైన సమాధానాలు సాధించిన అభ్యర్థిని చూస్తారు

ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2)లో తక్కువ నిష్పత్తిలో తప్పు సమాధానాలు, సరైన సమాధానాలు సాధించిన అభ్యర్థులను చూస్తారు

ఆ తర్వాత కూడా టై ఉంటే అభ్యర్థులకు ఒకటే ర్యాంకు కేటాయిస్తారు.

పేపర్ 2బి (బిప్లానింగ్)

మ్యాథ్స్​లో స్కోరు

ఆ తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్​లో స్కోరు

ఆ తర్వాత ప్లానింగ్ బేస్డ్ ప్రశ్నల్లో స్కోర్​

జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్​ 2 అన్ని సబ్జెక్టుల్లో ప్రయత్నించిన తప్పు సమాధానాలు తక్కువ, సరైన సమాధానాల నిష్పత్తి ఎక్కువ ఉన్న అభ్యర్థులను చూస్తారు

గణితంలో (పార్ట్ -1) తక్కువ నిష్పత్తిలో తప్పు సమాధానాలు, సరైన సమాధానాలు సాధించిన అభ్యర్థిని చూస్తారు

ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2)లో తక్కువ నిష్పత్తిలో ప్రయత్నించిన తప్పు సమాధానాలు, సరైన సమాధానాలు చూస్తారు

ప్లానింగ్ బేస్డ్ ప్రశ్నల్లో (పార్ట్-3) తక్కువ నిష్పత్తిలో తప్పుడు, సరైన సమాధానాలు సాధించిన అభ్యర్థలను చూస్తారు.

ఒకవేళ అక్కడా టై కొనసాగితే అభ్యర్థులకు జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్​ 2 ఫలితాల్లో ఒకటే ర్యాంకు కేటాయిస్తారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.