JEE Mains Answer Key : జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 'ఆన్సర్​ కీ'లో తప్పులు ఉన్నాయా?-jee mains answer key 2025 session 2 last date today to raise objections ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Jee Mains Answer Key : జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 'ఆన్సర్​ కీ'లో తప్పులు ఉన్నాయా?

JEE Mains Answer Key : జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 'ఆన్సర్​ కీ'లో తప్పులు ఉన్నాయా?

Sharath Chitturi HT Telugu

JEE mains session 2 answer key : జేఈఈ మెయిన్స్ సెషన్​ 2 'ఆన్సర్ కీ'కి సంబంధించిన అబ్జెక్షనల్​ విండో నేటితో ముగియనుంది. సమాధానాలపై అభ్యంతరాలు తెలియజేయడానికి డైరెక్ట్ లింక్​తో పాటు పూర్తి ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 ఆన్సర్​ కీ అబ్జెక్షన్​ విండో

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 ఆన్సర్​ కీ 2025లో అభ్యంతరాలు ఉన్నాయా? వాటిని సవాలు చేసేందుకు ఈరోజే లాస్ట్​ డేట్​. సెషన్​ 2కి సంబంధించిన అబ్జెక్షన్​ విండోను ఎన్టీఏ నేడు మూసివేయనుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునే అభ్యర్థులు jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్​ సెషన్ 2 పేపర్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీని 2025 ఏప్రిల్ 11న విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ రోజు రాత్రి 11.50 గంటలకు గడువు ముగియనుంది.

“పేపర్​ 1 (బీఈ- బీటెక్​) ఆన్సర్​ కీతో పాటు రెస్పాన్స్​ షీట్​, క్వశ్చన్​ పేపర్లను jeemain.nta.nic.in లో అప్లోడ్​ చేశాము. ప్రొవిజనల్​ ఆన్సర్​ కీలో అభ్యంతరాలు తెలపాలనుకునే అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ. 200లు చెల్లించి సవాలు చేయవచ్చు,” అని అధికారిక ప్రకటనలో ఉంది.

జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2025 సెషన్ 2పై అభ్యంతరాలను తెలియజేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అభ్యంతరాలను ఎలా నమోదు చేయండి..

ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్​ని అనుసరించవచ్చు.

1. jeemain.nta.nic.in ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.

2. జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2025 సెషన్ 2 అబ్జెక్షన్ విండో లింక్​పై క్లిక్ చేయండి.

3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. సబ్మిట్​ బటన్​పై క్లిక్ చేస్తే మీ ఆన్సర్ కీ కనిపిస్తుంది.

5. ఆన్సర్ కీని చెక్ చేసి, మీరు అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటున్న సమాధానంపై క్లిక్ చేయండి.

6. సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

7. సబ్మిట్​పై క్లిక్ చేసి మీ అభ్యంతరాలను నింపాలి.

8. కన్ఫర్మేషన్ పేజీని డౌన్​లోడ్ చేసుకుని, తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.

ఫీజును డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏప్రిల్ 13, 2025 వరకు (రాత్రి 11:50 గంటల వరకు) చెల్లించవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించకుండా ఎలాంటి ఛాలెంజ్​ని స్వీకరించరు. ఛాలెంజ్​కు సంబంధించిన రుసుమును మరే ఇతర పద్ధతి ద్వారా స్వీకరించరు.

ఎన్టీఏ జేఈఈ మెయిన్ సెషన్ 2 పేపర్-1 ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో దేశవ్యాప్తంగా 285 నగరాల్లో, భారత్ వెలుపల 15 నగరాల్లోని 531 కేంద్రాల్లో జరిగింది. పేపర్-2 పరీక్షను 2025 ఏప్రిల్ 9న నిర్వహించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం