JEE Mains 2025 session 2 : జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..-jee mains 2025 session 2 registration begins direct link to apply and other details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Jee Mains 2025 Session 2 : జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

JEE Mains 2025 session 2 : జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

Sharath Chitturi HT Telugu
Feb 02, 2025 10:32 AM IST

JEE Mains 2025 session 2 registration : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. జేఈఈ మెయిన్స్​ 2025 రెండో సెషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

జేఈఈ మెయిన్స్ 2025 సెషన్-2 రిజిస్ట్రేషన్ ప్రారంభం..
జేఈఈ మెయిన్స్ 2025 సెషన్-2 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. (Official website, screenshot)

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్- జేఈఈ మెయిన్స్​ 2025 రెండో సెషన్ కోసం ప్రిపేర్​ అవుతున్న విద్యార్థులకు కీలక అలర్ట్​! జేఈఈ మెయిన్స్​ సెషన్ 2​ రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ jeemain.nta.nic.in లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

yearly horoscope entry point

జేఈఈ మెయిన్స్​ 2వ సెషన్​ రిజిస్ట్రేషన్​కి చివరి తేదీ ఫిబ్రవరి 25 అని గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్ 2: ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తు విండో ముగింపు: ఫిబ్రవరి 25 (రాత్రి 9 గంటలు)
  • ఫీజు చెల్లింపు విండో ముగింపు: ఫిబ్రవరి 25 (రాత్రి 11:50)
  • పరీక్ష తేదీలు: ఏప్రిల్ 1 నుంచి 8 వరకు

పేపర్ల వారీగా షెడ్యూల్, ఎగ్జామ్ సిటీ, అడ్మిట్ కార్డు, రిజల్ట్ డిక్లరేషన్ తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటిస్తుంది.

జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్ 1కు హాజరై రెండో సెషన్​కి కూడా హాజరు కావాలనుకునే అభ్యర్థులు తమ పాత అప్లికేషన్ నంబర్, పాస్​వర్డ్​తో లాగిన్ అయి పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పేపర్, పరీక్ష మాధ్యమం, సిటీ ప్రిఫరెన్స్ కూడా మార్చుకోవచ్చు!

జేఈఈ మెయిన్స్ సెషన్-2 కోసం అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకుని ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ఒక అభ్యర్థి కేవలం ఒక దరఖాస్తు ఫారాన్ని మాత్రమే నింపడానికి అనుమతి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ నంబర్లు కలిగి ఉన్నట్లు తేలిన వారి అప్లికేషన్​ని రద్దు చేస్తారు.

జేఈఈ మెయిన్స్ సెషన్-2కు దరఖాస్తు చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు 011-40759000, 011-69227700 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా jeemain@nta.ac.in ఈ-మెయిల్ కూడా చేయవచ్చు.

జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 జేఈఈ మెయిన్ సెషన్

జేఈఈ మెయిన్స్​ సెషన్​ 1 ఇలా..

జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్ 1.. జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో జరిగింది.

284 నగరాల్లోని 598 కేంద్రాల్లో సుమారు 13 లక్షల మంది అభ్యర్థులకు సెషన్-1 నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మొత్తం హాజరు 94.5 శాతంగా నమోదైంది.

పరీక్ష బులెటిన్ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికి సెషన్ 1 ఫలితాలను ప్రకటిస్తారు.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ఎన్​ఐటీల్లో ప్రవేశం కోసం ఈ జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రతియేటా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు.

Whats_app_banner

సంబంధిత కథనం