నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్ 2లో అడిగిన కనీసం తొమ్మిది ప్రశ్నల్లో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు, నిపుణులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎన్టీఏ ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఆధారంగా నిర్ధారణకు రావద్దని కోరింది. అనవసర సందేహాలు, ఆందోళన కలిగించే వార్తలతో అభ్యర్థులను తప్పుదోవ పట్టించవద్దని కోరింది.
ఎన్టీఏ ఎల్లప్పుడూ పారదర్శక పరీక్ష ప్రక్రియను అనుసరిస్తుందని, ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ రికార్డు చేసిన ప్రతిస్పందనలను చూడటానికి అనుమతిస్తుందని తెలిపింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీలోని ప్రతి సవాలును ఎన్టీఏ చాలా సీరియస్ గా పరిగణిస్తుంది' అని ఎన్టీఏ ఇటీవల ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ప్రశ్నలు, వాటికి అభ్యర్థుల సమాధానాలతో పాటు ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఎన్టీఏ విడుదల చేసింది. ఆ తర్వాత ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అనుమతించింది. అభ్యంతర విండో క్లోజ్ అయిన తర్వాత ఆ అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల ప్యానెల్ సమీక్షిస్తుంది. అభ్యంతరాలు ఉంటే అందుకు అనుగుణంగా ఫైనల్ ఆన్సర్ కీని సవరిస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ నుంచి తప్పు సమాధానాలను తొలగిస్తారు.
జేఈఈ మెయిన్ పరీక్షల మార్కింగ్ స్కీమ్ ఈ కింది విధంగా ఉంటుంది.
ఒక ప్రశ్న తప్పుగా తేలితే లేదా ప్రశ్నను తొలగించినట్లయితే: అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు (+4).
జేఈఈ మెయిన్ రెండో సెషన్ ఫలితాలు ఏప్రిల్ 17న వెలువడనున్నాయి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం