రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. ఏం తీసుకెళ్లొచ్చు, ఏం తీసుకెళ్లకూడదు? ఓసారి చూడండి-jee advanced 2025 exam tomorrow dress code iit entrance exam day guidelines what to carry or not ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. ఏం తీసుకెళ్లొచ్చు, ఏం తీసుకెళ్లకూడదు? ఓసారి చూడండి

రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. ఏం తీసుకెళ్లొచ్చు, ఏం తీసుకెళ్లకూడదు? ఓసారి చూడండి

Anand Sai HT Telugu

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివారం మే 18న జరగనుంది. అయితే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్

ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా 222 నగరాల్లో జరగనుంది. ఆన్లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది.

ఈసారి ఐఐటీ కాన్పూర్ పరీక్షను నిర్వహిస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ జవాబు పత్రాన్ని మే 22న సాయంత్రం 5 గంటలకు రెస్పాన్స్ షీట్ వెబ్ సైట్‌లో విడుదల చేయనున్నారు. మే 26న ఉదయం 10 గంటలకు ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఫలితాలను జూన్ 2న విడుదల చేయనున్నారు.

విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లాలి. పేపర్-1 కోసం విద్యార్థులందరూ ఉదయం 7 గంటలకు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలి. మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యార్థులు పేపర్-2కు రిపోర్టు చేస్తారు.

అభ్యర్థులు తాగునీరు, పెన్నులు, పెన్సిళ్లను పరీక్ష హాల్లోకి తీసుకురావడానికి అనుమతిస్తారు. వాచ్‌లు, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్‌ఫోన్లు, మైక్రోఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. బూట్ల స్థానంలో చెప్పులు ధరించాల్సి ఉంటుంది.

ఉంగరాలు, బ్రాస్ లెట్‌లు, చెవిపోగులు, తాయత్తులు, చెవిపోగులు, గొలుసులు, నెక్లెస్‌లు, బ్యాడ్జీలు, పెద్ద బటన్ ఉన్న దుస్తులు వంటి వాటిని ధరించరాదు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. అబ్బాయిలు తక్కువ జేబులు ఉన్న ప్యాంట్లు లేదా షర్టులు ధరించాలి. అమ్మాయిలు స్కార్ఫ్ దుస్తులు ధరించకూడదు. పారదర్శకమైన నీటి బాటిల్‌ను తీసుకెళ్లొచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్